Share News

Chelluboina Venugopal: మీడియాలో కనిపించాలనే అసెంబ్లీలో ఆందోళన

ABN , Publish Date - Feb 07 , 2024 | 11:44 AM

ఎన్నికైన వారు ప్రజలకు జవాబుదారితనంతో పని చేయాలని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ తెలిపారు. విఫల పక్షం, పలాయన ప్రతి పక్షం వెళ్ళిపోతుందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్రాన్ని మోసగించారని పేర్కొన్నారు.

Chelluboina Venugopal: మీడియాలో కనిపించాలనే అసెంబ్లీలో ఆందోళన

అమరావతి: ఎన్నికైన వారు ప్రజలకు జవాబుదారితనంతో పని చేయాలని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ తెలిపారు. విఫల పక్షం, పలాయన ప్రతి పక్షం వెళ్ళిపోతుందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్రాన్ని మోసగించారని పేర్కొన్నారు. చేయలేనిది చెప్పనని.. చేసేదే చెపుతానని జగన్ చెప్పారని తెలిపారు. పేదరిక నిర్మూలన జరగాలంటే విద్య కీలకమని.. అందుకే దానికి జగన్ పెద్ద పీట వేశారన్నారు. మీడియాలో కనిపించాలని అసెంబ్లీలో ఆందోళన చేస్తున్నారని చెల్లుబోయిన పేర్కొన్నారు. స్వీకర్ పోడియం పైకి వెళ్లడంతో టీడీపీ పని అయిపోయిందన్నారు.

రాజ్యాంగ బద్దంగా నడవాల్సిన వారు విరుద్గంగా నడుస్తున్నారని.. ప్రజల జీవన ప్రమాణాలు పెంచే విధంగా బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయని మంత్రి చెల్లుబోయిన తెలిపారు. ఏదో విధంగా అధికారం లోకి రావాలని ప్రతిపక్షం ప్రయత్నం చేస్తోందన్నారు. బాధ్యతా రాహిత్యం తప్ప.. ఏమి తెలియని పార్టీ తెలుగుదేశమని అన్నారు. అల్జీమర్స్ వచ్చిన వ్యక్తి చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. కాపు సామాజికవర్గం ఎలా నష్టపోతుందో ప్రజలకు చెప్పాలన్నారు. డీబీటీలో ఎలాంటి అక్రమాలు లేవన్నారు. అల్జీమర్స్ చంద్రబాబు, అల్ జీరో బాబుగా మిగిలిపోతాడని చెల్లుబోయిన అన్నారు.

Updated Date - Feb 07 , 2024 | 11:44 AM