రూ.4.30 లక్షల కర్ణాటక మద్యం సీజ్
ABN , Publish Date - May 06 , 2024 | 01:36 AM
అక్రమంగా తరలిస్తున్న రూ.4.30 లక్షల విలువ చేసే కర్ణాటక మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తరలిస్తున్న నలుగురిని అరెస్టు చేయగా ఇద్దరు పారిపోయారు.
ఫ నలుగురి అరెస్టు... ఇద్దరు పరార్
చిత్తూరు, మే 5: అక్రమంగా తరలిస్తున్న రూ.4.30 లక్షల విలువ చేసే కర్ణాటక మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తరలిస్తున్న నలుగురిని అరెస్టు చేయగా ఇద్దరు పారిపోయారు. శంకరయ్యగుంటలోని ఓ షాపు వద్ద మారుతి వ్యాను నుంచి కర్ణాటక మద్యాన్ని దించుతుండగా రహస్య సమాచారం మేరకు ఎస్ఐలు ఇక్బాల్, ప్రసాద్ సిబ్బందితో కలిసి సాయికృష్ణారెడ్డి, ఆనంద్, నవీన్కుమార్, భానుప్రకాష్లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 815 టెట్రా ప్యాకెట్లతోపాటు ఓమిని వ్యాన్ను స్వాధీనం చేసుకున్నారు. కారు, మద్యం విలువ రూ.4.30లక్షలు ఉంటుందని సీఐ ఉలసయ్య తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి, రిమాండ్కు తరలించారు. పరారీలో ఉన్న పకోడా కుమార్, ఆలీని త్వరలోనే పట్టుకుంటామన్నారు.