Share News

11 మంది డీలర్లు, ముగ్గురు ఎండీయూ ఆపరేటర్ల సస్పెన్షన్‌

ABN , Publish Date - May 09 , 2024 | 12:45 AM

న్నికల ప్రచారంలో పాల్గొన్న 11 మంది రేషన్‌ డీలర్లు, ముగ్గురు ఎండీయూ ఆపరేటర్లను సస్పెండ్‌ చేసినట్లు డీఎస్వో శంకరన్‌ తెలిపారు.

11 మంది డీలర్లు, ముగ్గురు ఎండీయూ ఆపరేటర్ల సస్పెన్షన్‌

చిత్తూరు కలెక్టరేట్‌, మే 8: ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న 11 మంది రేషన్‌ డీలర్లు, ముగ్గురు ఎండీయూ ఆపరేటర్లను సస్పెండ్‌ చేసినట్లు డీఎస్వో శంకరన్‌ తెలిపారు. వారు ప్రచారాల్లో, ఇతరత్రా కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు ఫిర్యాదులు రావడం, విచారణలో వాస్తవమని తేలడంతో కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి షన్మోహన్‌ సస్పెన్షన్‌ వేటు వేశారని పేర్కొన్నారు. ఆయా పరిధిలోని కార్డుదారులకు ఇబ్బంది లేకుండా సమీప డీలర్లు, ఎండీయూ ఆపరేటర్ల ద్వారా మే నెల నిత్యావసర సరుకులు అందజేస్తున్నామని తెలిపారు. కాగా, ఏప్రిల్‌లో కార్డుదారులకు నిత్యావసర సరుకులు సక్రమంగా అందించని కారణంగా 30మంది ఎండీయూ ఆపరేటర్లకు జీతాలు నిలుపుదల చేస్తూ జిల్లా పౌరసరఫరాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది

Updated Date - May 09 , 2024 | 12:46 AM