Dastagiri: జగన్కు అంతా తెలుసు.. అవినాశ్కి ఇదే నా సవాల్
ABN , Publish Date - Apr 22 , 2024 | 12:52 PM
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల నుంచి మౌనంగాఉండి ఈరోజు వివేకా నంద రెడ్డి హత్య గురించి మాట్లా డుతున్నారని.. ఆయనకు ప్రతి ఒక్కటి బాగా తెలుసని ఈ హత్య కేసు నిందితుడు, జై భీమ్ పార్టీ పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థి దస్తగిరి తెలిపారు. సిద్ధం సభలు పెట్టుకొని జగన్మో హన్ రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. వైఎస్ వివేకానందరెడ్డిని ఎవ రు హత్య చేశారో ప్రజలందరికీ తెలుసన్నారు.
![Dastagiri: జగన్కు అంతా తెలుసు.. అవినాశ్కి ఇదే నా సవాల్](https://media.andhrajyothy.com/media/2023/20230418/dastagiri_viveka_case_ad4ef2a1f6.jpg)
కడప: ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల నుంచి మౌనంగా ఉండి ఈరోజు వివేకా నంద రెడ్డి హత్య గురించి మాట్లా డుతున్నారని.. ఆయనకు ప్రతి ఒక్కటి బాగా తెలుసని ఈ హత్య కేసు నిందితుడు, జై భీమ్ పార్టీ పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థి దస్తగిరి తెలిపారు. సిద్ధం సభలు పెట్టుకొని జగన్మో హన్ రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. వైఎస్ వివేకానందరెడ్డిని ఎవ రు హత్య చేశారో ప్రజలందరికీ తెలుసన్నారు. జై భీమ్ పార్టీ కార్యాలయం పులివెందులలో జగన్మోహన్ రెడ్డి ఇంటి పక్కనే ఏర్పాటు చేయడం జరిగిందని దస్తగిరి వెల్లడించారు.
Loksabha Elections: బెంగళూరు చేరిన ఖమ్మం పంచాయితీ
జై భీమ్ పార్టీ ఆఫీసును తొలగించాలని అధికారులు ఒత్తిడి తెస్తున్నారని తెలిపారు. ఆఫీసుకు పర్మిషన్ ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని దస్తగిరి వెల్లడించారు. సచివాలయం సిబ్బంది జై భీమ్ పార్టీ ఆఫీసును తొలగించాలని చెబుతున్నారన్నారు. అవినాశ్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి సునీతమ్మకు.. తనకు చీకటి ఒప్పందం ఉంది అనడం సరికాదన్నారు. ‘‘అవినాశ్ రెడ్డికి సవాల్ విసురుతున్నా... ఆ చీకటి ఒప్పందం ఏంటో 24 గంటల లోపు బయట పెడితే నేను జైలుకు పోవడానికి సిద్ధం... 24 వ తేదీన పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నా ’’ అని దస్తగిరి తెలిపారు.
ఇవి కూడా చదవండి...
Attack On YS Jagan: వైఎస్ జగన్పై గులకరాయి దాడి కేసులో కొత్త అనుమానాలు.. అసలేం జరిగింది..!?
Pawan Kalyan: పవన్ సభలో కత్తులతో కలకలం.. ఏకంగా పోలీసులపైనే..!?
ఏపీ వార్తలు కోసం..