Share News

ప్రశాంతంగా ఏపీఈసెట్‌-2024

ABN , Publish Date - May 09 , 2024 | 12:55 AM

కాకినాడ రూరల్‌, మే 8: రాష్ట్రవ్యాప్తంగా బుధవారం ఏపీఈసెట్‌-2024 ప్రవేశపరీక్షను అనంతపురం జేఎన్టీయూఏ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ పరీక్షను కాకినాడ జి

ప్రశాంతంగా ఏపీఈసెట్‌-2024

కాకినాడ రూరల్‌, మే 8: రాష్ట్రవ్యాప్తంగా బుధవారం ఏపీఈసెట్‌-2024 ప్రవేశపరీక్షను అనంతపురం జేఎన్టీయూఏ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ పరీక్షను కాకినాడ జిల్లాలో 5 కేంద్రాల్లో 2 సెషన్‌లలో నిర్వహించగా మొత్తం 2140 మంది విద్యార్థులకు 2094 మంది హాజరయ్యారని కన్వీనర్‌ ప్రొఫెసర్‌ భానుమూర్తి తెలిపారు. కాకినాడ ఐయాన్‌ డిజిటల్‌ జో న్‌, ప్రగతి ఇంజనీరింగ్‌ కళాశాల, ఆదిత్య సూరంపాలెం క్యాం పస్‌లోని 3 కేంద్రాల్లోనూ ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకూ ఆన్‌లైన్‌లో పరీక్షలు జరిగాయన్నారు. మొదటి సెషన్‌లో 1071 మందికి 1037 మంది, రెండో సెషన్‌లో 1069 మందికి 1057 మంది హాజరుకాగా మొదటి సెషన్‌కి 97 శాతం, రెండో సెషన్‌కి 99శాతం హాజరు నమోదైందన్నారు.

Updated Date - May 09 , 2024 | 12:55 AM