Share News

వీర జవాన్లను స్మరించుకోవాలి

ABN , Publish Date - Jul 27 , 2024 | 01:31 AM

దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీర జవాన్లను స్మరించుకోవాలని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. కార్గిల్‌ విజయ్‌ దివాస్‌ ర్యాలీని శుక్రవారం అనపర్తిలో బీజేవైఎం ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నల్లమిల్లి ముందుగా స్థానిక గాంధీ బొమ్మ సెంటర్‌లో గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

వీర జవాన్లను స్మరించుకోవాలి

  • ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి

  • ఘనంగా కార్గిల్‌ విజయ దివాస్‌.. అమరువీరులకు ఘన నివాళి

అనపర్తి, జూలై 26: దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీర జవాన్లను స్మరించుకోవాలని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. కార్గిల్‌ విజయ్‌ దివాస్‌ ర్యాలీని శుక్రవారం అనపర్తిలో బీజేవైఎం ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నల్లమిల్లి ముందుగా స్థానిక గాంధీ బొమ్మ సెంటర్‌లో గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం దేవీచౌక్‌ వరకు ర్యాలీ కొనసాగింది. కూటమి నాయకులు కార్యక ర్తలు కాగడాలు, కొవ్వొత్తులతో ర్యాలీలో పాల్గొని అమరవీరులకు నివాళులర్పిం చారు. కార్గిల్‌ రక్షణ కోసం సుమారు 500మంది జవాన్లు ప్రాణ త్యాగం చేసి ఆ భూ భాగాన్ని దేశానికి అందించిన వీర జవాన్లకు ప్రతి పౌరుడు రుణపడి ఉండాలని నల్లమిల్లి అన్నారు. కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి శివరామకృష్ణంరాజు, నాయకులు సిరపల్లి నాగేశ్వరరావు, సత్తి దేవదానరెడ్డి, తమలంపూడి సుధాకరరెడ్డి, కొవ్వూరి శ్రీనివాసరెడ్డి, మల్లిడి శ్రీనివాసరెడ్డి, కొవ్వూరి వెంకటరామారెడ్డి, తాడి గంగిరెడ్డి చింతా సురేష్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Jul 27 , 2024 | 08:02 AM