Share News

ముంపు ప్రాంతాల్లో పారిశుధ్య పనులు చేపట్టాలి

ABN , Publish Date - Jul 27 , 2024 | 01:28 AM

: గోదావరి వరద ముంపుకు గురైన ప్రాంతా ల్లో పారిశుధ్య లోపం లేకుండా సత్వర చర్యలు చేపట్టాలని జి ల్లా జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ ఎంజే అభిషేక్‌గౌడ్‌ పేర్కొన్నారు. శుక్రవారం జేసీ ఎటపాక మండ లంలోని గౌరీదేవిపేట, నంది గా మ, మురుమూల గ్రామాల్లో పర్యటించారు.

 ముంపు ప్రాంతాల్లో పారిశుధ్య పనులు చేపట్టాలి

  • మండలంలో మూడోరోజు జేసీ పర్యటన

ఎటపాక, జూలై 26: గోదావరి వరద ముంపుకు గురైన ప్రాంతా ల్లో పారిశుధ్య లోపం లేకుండా సత్వర చర్యలు చేపట్టాలని జి ల్లా జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ ఎంజే అభిషేక్‌గౌడ్‌ పేర్కొన్నారు. శుక్రవారం జేసీ ఎటపాక మండ లంలోని గౌరీదేవిపేట, నంది గా మ, మురుమూల గ్రామాల్లో పర్యటించారు. పునరావాస కేంద్రాలతోపాటు వర ద ముంపునకు గురైన గ్రామాల్లో అంటువ్యాధులు ప్రబలకుండ్లా పారిశుధ్య సమ స్య లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పునరావాస కేంద్రాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటుచేసి, పరీక్షలు నిర్వహించి, మందులను పంపిణీ చేయా లని వైద్య ఆరోగ్య అధికారులను ఆదేశించారు. వర్షాలు, వరదలతో దెబ్బతిన్న రహ దారుల వివరాల నివేదికను తయారుచేసి, పంపాలని ఆధికారులను ఆదేశించా రు. వరద బాధితులకు పునరావాస కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు కలుగకు ండా చర్యలు తీసుకోవాలని, గోదావరి వరద, వర్షాలు తగ్గిన తర్వాత పంట నష్టం అంచనాల వివరాలు సేకరించేందుకు సర్వే నిర్వహిస్తామని చెప్పారు. వైఎస్‌ ఎంపీపీ దొంతు మంగేశ్వరరావు, పాల్గొన్నారు.

Updated Date - Jul 27 , 2024 | 08:27 AM