Share News

పటిష్టమైన బందోబస్తు నడుమ సార్వత్రిక ఎన్నికల నిర్వహణ : ఎస్పీ

ABN , Publish Date - May 09 , 2024 | 12:54 AM

కాకినాడ క్రైం, మే 8: ప్రశాంత వాతావరణంలో పటిష్టమైన బందోబస్తు నడుమ సార్వత్రిక ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నట్టు, ఎన్నికల విధుల్లో మంచి అను భవం గడించాలని ఎస్పీ ఎస్‌.సతీష్‌కుమార్‌ కోరారు. సార్వత్రిక ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు హైదరాబాద్‌ సర్ధార్‌ వల్లబాయ్‌ పటేల్‌ పోలీసు అకాడమీలో శిక్షణ పొందుతున్న 8మంది ట్రైనీ ఐపీఎస్‌ అధికారులు బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో రిపోర్టు చేశారు. ఎస్పీని మర్యాదపూర్వకంగా

పటిష్టమైన బందోబస్తు నడుమ  సార్వత్రిక ఎన్నికల నిర్వహణ : ఎస్పీ

కాకినాడ క్రైం, మే 8: ప్రశాంత వాతావరణంలో పటిష్టమైన బందోబస్తు నడుమ సార్వత్రిక ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నట్టు, ఎన్నికల విధుల్లో మంచి అను భవం గడించాలని ఎస్పీ ఎస్‌.సతీష్‌కుమార్‌ కోరారు. సార్వత్రిక ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు హైదరాబాద్‌ సర్ధార్‌ వల్లబాయ్‌ పటేల్‌ పోలీసు అకాడమీలో శిక్షణ పొందుతున్న 8మంది ట్రైనీ ఐపీఎస్‌ అధికారులు బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో రిపోర్టు చేశారు. ఎస్పీని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికలు ఛాలెంజ్‌గా తీసుకోవాలని, ఇది భవిష్యత్తులో ఉద్యోగ నిర్వహణలో అనుభవం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు వచ్చిన ట్రైనీ శిక్షణా పోలీసు అధికారులను కాకినాడ, పెద్దాపురం సబ్‌ డివిజన్‌ పరిధిలో ఎన్నికల విధులు నిర్వహించేందుకు కేటాయిస్తామని తెలిపారు.

Updated Date - May 09 , 2024 | 12:54 AM