Share News

ABN Big Debate with CBN: నాడు ఎన్టీఆర్‌నే బెదిరించారు.. నేడు భయపడుతున్నారు..

ABN , Publish Date - May 08 , 2024 | 09:22 PM

ABN Big Debate with CBN: ఏబీఎన్-ఆంధ్రజ్యోతి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ బిగ్‌డిబేట్‌లో(ABN Big Debate) టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) పాల్గొన్నారు. ఈ డిబేట్‌లో ఆయన అనేక కీలక అంశాలను వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న భయానక పరిస్థితుల గురించి వివరించారు.

ABN Big Debate with CBN: నాడు ఎన్టీఆర్‌నే బెదిరించారు.. నేడు భయపడుతున్నారు..
ABN Big Debate with CBN

ABN Big Debate with CBN: ఏబీఎన్-ఆంధ్రజ్యోతి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ బిగ్‌డిబేట్‌లో(ABN Big Debate) టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) పాల్గొన్నారు. ఈ డిబేట్‌లో ఆయన అనేక కీలక అంశాలను వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న భయానక పరిస్థితుల గురించి వివరించారు. జగన్ పాలనలో ప్రజలందరిలో భయం నెలకొంది.. ప్రభుత్వ అధికారులు సైతం గొంతు ఎత్తలేని పరిస్థితి ఉందన్నారు చంద్రబాబు.


‘నా 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి చూడలేదు. ప్రభుత్వం ఏదైనా.. ఏ ముఖ్యమంత్రినైనా గట్టిగా నిలదీసేది ఎన్జీవోలు. తమ డిమాండ్స్ కోసం మాట్లాడేది ఎన్జీవోలు. అలాంటి ఎన్జీవోలు ఈ ఐదేళ్లలో నోరు విప్పే పరిస్థితే లేదు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన్ను కొట్టబోయారు కూడా. పూల కుండీలు ఆయన టేబుల్ మీద పగలగొట్టారు. బీజూపట్నాయక్ చొక్కా కూడా చింపేశారు ఎన్జీవోలు. ప్రభుత్వాలకు ఎన్జీవో లీడర్లు భయపడేవారు కాదు. కానీ.. రాష్ట్రంలో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. జగన్ పాలనలో ఎన్జీవో నేతలు భయపడే పరిస్థితి నెలకొంది. ఒక్కరు కూడా నోరు మెదపడం లేదు. భయంతో హడలిపోవాల్సిన పరిస్థితి నెలకొంది.’ అంటూ రాష్ట్రంలోని పరిస్థితులను చంద్రబాబు వివరించారు.

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - May 08 , 2024 | 09:24 PM