Share News

AP Elections 2024: రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన మాక్ పోలింగ్

ABN , Publish Date - May 13 , 2024 | 06:33 AM

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మాక్ పోలింగ్ ప్రారంభమైంది. ఐదు గంటలకే ప్రధాన పార్టీల ఏజెంట్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా మాక్ పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మరోవైపు కర్నూలులో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది.

AP Elections 2024: రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన మాక్ పోలింగ్
Mock Polling

అమరావతి: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మాక్ పోలింగ్ ప్రారంభమైంది. ఐదు గంటలకే ప్రధాన పార్టీల ఏజెంట్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా మాక్ పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మరోవైపు కర్నూలులో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. గూడూరులో అర్ధరాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. విజయనగరం. ఉభయ జిల్లాలలో మాక్ పోలింగ్ ప్రారంభమైంది. రైల్వేకోడూరు నియోజకవర్గంలోని పుల్లంపేట మండలం పాపక్కగారిపల్లెలో టీడీపీ ఏజెంట్లను వైసీపీ నేతలు కిడ్నాప్ చేశారు.

Loksabha Elections: ఖమ్మంలో మాక్‌ పోలింగ్ ప్రారంభం


సమస్యాత్మక.. అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. అరకు పార్లమెంట్ నియోజకవర్గంలో.. అరకు, రంపచోడవరం, పాడేరు నియోజకవర్గాల్లో సాయంత్రం నాలుగు గంటల వరకు మాత్రమే పోలింగ్ జరగనుంది. పాలకొండ, కురుపాం, సాలూరులో సాయంత్రం ఐదు గంటల వరకూ మాత్రమే పోలింగ్ జరగనుంది. దాదాపు అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ చేస్తున్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ఠమైన భద్రతను అధికారులు ఏర్పాటు చేశారు.

ఎన్నాళ్లకు.. ఎన్నేళ్లకు..!

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 13 , 2024 | 06:33 AM