Share News

AP Elections 2024: పోలింగ్ ప్రారంభానికి ముందే వైసీపీ అరాచకాలు.. ఒక్కోచోట ఒక్కోలా..

ABN , Publish Date - May 13 , 2024 | 07:06 AM

నరసరావుపేట మండలం ఉప్పలపాడులో వైసీపీ నేతల దౌర్జన్యం వెలుగు చూసింది. టీడీపీ తరుపున ఏజెంట్ ఫామ్ ఇవ్వడానికి వెళ్లిన సుబ్బయ్యపై దాడి చేయడం జరిగింది. సుబ్బయ్యకి గాయాలు కాగా.. నరసరావుపేట ఆసుపత్రికి తరలించారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ దౌర్జన్యానికి దిగింది. రెంటచింతలలో టీడీపీ ఏజెంట్ల దాడికి పాల్పడ్డారు. నలుగురు టీడీపీ ఏజెంట్లకు తలలు పగిలాయి.

AP Elections 2024: పోలింగ్ ప్రారంభానికి ముందే వైసీపీ అరాచకాలు.. ఒక్కోచోట ఒక్కోలా..
YSRCP

అమరావతి: నరసరావుపేట మండలం ఉప్పలపాడులో వైసీపీ నేతల దౌర్జన్యం వెలుగు చూసింది. టీడీపీ (TDP) తరుపున ఏజెంట్ ఫామ్ ఇవ్వడానికి వెళ్లిన సుబ్బయ్యపై దాడి చేయడం జరిగింది. సుబ్బయ్యకి గాయాలు కాగా.. నరసరావుపేట ఆసుపత్రికి  తరలించారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ దౌర్జన్యానికి దిగింది. రెంటచింతలలో టీడీపీ ఏజెంట్ల దాడికి పాల్పడ్డారు. నలుగురు టీడీపీ ఏజెంట్లకు తలలు పగిలాయి.

Lok Sabha Elections 2024: 4వ విడత ఎన్నికల్లో మహామహుల పోటీ.. ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకోసం..

ఏజెంట్లుగా టీడీపీ వాళ్లకు ఉండటానికి వీలేద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నారు, మరోవైపు కర్నూలు జిల్లా హొళగుంద మండలం ఎల్లర్తి గ్రామంలో ఓటర్లకు డబ్బులు పంచుతున్న వైసీపీ నాయకులను టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే ఓ టీడీపీ కార్యకర్త చేయిని వైసీపీ నేతలు విరగొట్టారు. అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మరోవైపు మంత్రి పెద్దిరెడ్డి సొంత మండలంలో టీడీపీ ఏజెంట్లను వైసీపీ కిడ్నాప్ చేశారు.

ఇవి కూడా చదవండి..

Gold and Silver Rates: తగ్గిన బంగారం, వెండి రేట్లు..ఎంతకు చేరాయంటే

కూటమిలో జోష్‌!

Read Latest AP News And Telugu News

Updated Date - May 13 , 2024 | 07:07 AM