Share News

Ganta Srinivas Rao: సీఎం దృష్టికి గురుకుల సమస్యలు

ABN , Publish Date - Jul 10 , 2024 | 05:26 PM

రాష్ట్రంలో గురుకుల పాఠశాలలను టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు తొలిసారిగా ప్రారంభించారని మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం విశాఖపట్నం జిల్లా సింహాచలం అడవివరం సమీపంలోని గురుకుల పాఠశాలలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు.

Ganta Srinivas Rao: సీఎం దృష్టికి గురుకుల సమస్యలు
Bheemili MLA Ganta Srinivasa Rao

విశాఖపట్నం, జులై 10: రాష్ట్రంలో గురుకుల పాఠశాలలను టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు తొలిసారిగా ప్రారంభించారని మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం విశాఖపట్నం జిల్లా సింహాచలం అడవివరం సమీపంలోని గురుకుల పాఠశాలలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాల పరిసరాలను ఈ సందర్భంగా ఆయన పరిశీలించారు. అనంతరం గురుకుల విద్యార్థులతో ఆయన మాట్లాడారు. ఆ క్రమంలో విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే గంటా భోజనం చేశారు.

Also Read: Mumbai: ‘అతడి’ కారణంగా బార్ కూల్చివేత..

అనంతరం గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ... గురుకుల పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న భోజన వసతులు బాగున్నాయన్నారు. అయితే గతంలో టీడీపీ ప్రభుత్వం నిర్మించిన అదనపు భవనాలు ఇప్పటికీ నిర్మాణ దశలోనే ఉండిపోయాయని తెలిపారు. వీటి నిర్మాణాన్ని గత వైసిపి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. ఇక వాటి నిర్మాణాన్ని త్వరలోనే పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామని స్పష్టం చేశారు. అలాగే గురుకులాల్లోని పలు సమస్యలను సైతం విద్యార్థులు సిబ్బంది తమ దృష్టి తీసుకువచ్చారన్నారు. వాటిని సైతం పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

Also Read: Pooja Khedkar : ట్రైయినీ ఐఏఎస్‌పై బదిలీ వేటు..


విద్యారంగానికి గతంలోనే టీడీపీ అధిక ప్రాధాన్యత ఇచ్చిందని.. అదే ప్రాధాన్యతను ప్రస్తుతం కొనసాగిస్తుందని మాజీ మంత్రి గంటా స్పష్టం చేశారు. మరోవైపు టీడీపీ అధినేత, సీఎం నారా చంద్రబాబు నాయుడు గురువారం విశాఖపట్నం వస్తున్నారన్నారన్నారు. ఈ సందర్భంగా గతంలో తాము ఇచ్చిన హామీలను ఆయన దృష్టికి తీసుకువెళ్తామని గంటా శ్రీనివాసరావు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Also Read: Minister Savitha: టీడీపీ హయాంలోనే రాష్ట్రాభివృద్ధి

2014లో విశాఖపట్నం జిల్లా భీమిలీ నుంచి టీడీపీ అభ్యర్థిగా గంటా శ్రీనివాసరావు గెలుపొందారు. ఈ ఎన్నికల్లో ఆంధ్రా ఓటరు.. టీడీపీ పట్టం కట్టారు. దీంతో రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం కొలువు తీరింది. దాంతో విద్యా శాఖ మంత్రిగా గంటా శ్రీనివాసరావు బాధ్యతలు చేపట్టారు. ఆ క్రమంలో రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పట్టిష్టం కావడానికి చర్యలు చేపట్టారు. అందులోభాగంగా పలు జిల్లాలో గురుకుల పాఠశాలు ఏర్పాటు చేయడంతోపాటు.. ఆ యా పాఠశాల్లోని అదనపు గదుల నిర్మాణానికి చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే.

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jul 10 , 2024 | 05:29 PM