హఠావో.. ఏపీ బచావో
ABN , Publish Date - May 09 , 2024 | 01:54 AM
దళితుల ఓట్లతో గద్దెనెక్కి దళితులపైనే దాడులు, హత్యలు, దౌర్జన్యాలకు పాల్పడిన జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలని ప్రబుద్ధ పీపుల్స్ రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర అధ్య క్షుడు దాసరి చెన్నకేశవులు పిలుపునిచ్చారు.
దాసరి చెన్నకేశవులు
మంగళగిరి, మే 8: దళితుల ఓట్లతో గద్దెనెక్కి దళితులపైనే దాడులు, హత్యలు, దౌర్జన్యాలకు పాల్పడిన జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలని ప్రబుద్ధ పీపుల్స్ రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర అధ్య క్షుడు దాసరి చెన్నకేశవులు పిలుపునిచ్చారు. మంగళగిరి తాలూకా సెంటర్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి బుధవారం ఆయన పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా చెన్నకేశవు లు మీడియాతో మాట్లాడుతూ దళితుల సంక్షేమానికి సంబంధిం చిన 27 పథకాలను జగన్ రద్దు చేసి విద్య, ఉద్యోగ, ఉపాధి అవకా శాలను దెబ్బతీశారని ధ్వజమెత్తారు. జగన్ హఠావో.. ఏపీ బచావో పేరిట ఈ నెల పదో తేదీన మంగళగిరి బైపాస్ రోడ్డులో నిర్వ హిస్తున్న మాలల సింహగర్జనను జయప్రదం చేయాలని కోరారు. మాల మహానాడు ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు గుర్రం రామారావు మాట్లాడుతూ దళితులను నమ్మించి వంచించిన జగన్కు సార్వ త్రిక ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో దళిత సం ఘాల నేతలు లాం అనిల్, గుర్రం భాగ్యరాజు, డి.అవినాష్, రవి, జేమ్స్, కూరపాటి రవి, గోపి, శంకర్, జలరావు, వినీత్ తదితరులు పాల్గొన్నారు.