Share News

గూండాల్లా వ్యవహరిస్తున్న వైసీపీ నాయకులు

ABN , Publish Date - May 09 , 2024 | 02:02 AM

నరసరావుపేటలో వైసీపీ నాయకులు కొంతమంది గూండాల్లా వ్యవహరిస్తున్నారని టీడీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్‌ విమర్శించారు.

గూండాల్లా వ్యవహరిస్తున్న వైసీపీ నాయకులు

టీడీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్‌

నరసరావుపేట టౌన, మే 8: నరసరావుపేటలో వైసీపీ నాయకులు కొంతమంది గూండాల్లా వ్యవహరిస్తున్నారని టీడీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్‌ విమర్శించారు. గురువారం నరసరావుపేట పట్టణంలోని టీడీపీ పల్నాడు జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్బంగా కొమ్మాల పాటి శ్రీధర్‌ మాట్లాడుతూ ఎన్నికలలో భయాందోళన సృషించి, ఓటర్లను రాకుండా చేయాలనే ఆలోచనతో పన్నాగాలు పన్నుతున్నారన్నారు. రేపు దొంగదారులలో విజయాన్ని సాధిస్తామనే భ్రమలో ఉన్నారన్నారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రాబోతుందని, ఎవ్వరైనా తప్పుడు చర్యలకు దిగితే తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. నరసరావుపేట పట్టణంలో మానేడి మోహనరావు ఇంటిపై దాడి చేయడం నీచమైనచర్య అన్నారు. మాచర్ల, గురజాల ప్రాంతాలలో భ యబ్రాతులు చేసేలా వైసీపీ నాయకుల చర్యలు ఉన్నాయన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపాటి రామచంద్రప్రసాదు మాట్లాడుతూ నరసరావుపేటలో వైసీపీ కార్యకర్తలు అంతా ఇప్పటికే పెట్రోల్‌ బాంబులు, రాడ్లు, రాళ్ళ కుప్పలు సిద్ధం చేసుకొని దాడిచేసి ఓటింగ్‌కు రాకుండా చేయాలనేది వారి ఆలోచనగా ఉందని పోలీసులకు లేఖ ఇచ్చారన్నారు. ఓటును వినియోగించుకొనేలా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టాలన్నారు. నరసరావుపేటలో ఉన్న రౌడీషీటర్స్‌ అందరినీ పోలీస్‌ కష్టడీలోకి తీసుకోవాలని, ఎన్నికల రోజున వాళ్ళు ఎవరూ లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటే నరసరావుపేటలో స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో ఓటింగ్‌ జరుగుతుందన్నారు. సమావేశంలో టీడీపీ లీగల్‌ సెల్‌ అధ్యక్షుడు చండ్రా ఆంజనేయులు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొట్టా కిరణ్‌కుమార్‌, సీతారామాంజనేయలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 09 , 2024 | 07:38 AM