Share News

మందడం యువకుడు ఐఎఫ్‌ఎస్‌కు ఎంపిక

ABN , Publish Date - May 09 , 2024 | 01:50 AM

జాతీయ స్థాయిలో యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ విడుదల చేసిన ఫలితాల్లో జిల్లాకు చెందిన తుమ్మల కృష్ణచైతన్య సత్తాచాటారు.

మందడం యువకుడు ఐఎఫ్‌ఎస్‌కు ఎంపిక
కృష్ణచైతన్య

తుమ్మల కృష్ణ చైతన్యకు జాతీయ స్థాయిలో 74వ ర్యాంకు

గుంటూరు(విద్య), మేడికొండూరు, మే8: జాతీయ స్థాయిలో యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ విడుదల చేసిన ఫలితాల్లో జిల్లాకు చెందిన తుమ్మల కృష్ణచైతన్య సత్తాచాటారు. తుళ్లూరు మండలం, మందడం గ్రామానికి చెందిన తుమ్మల కృష్ణ చైతన్య ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీసుకు ఎంపికయ్యారు. బుధవారం యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌ విడుదల చేసిన ఫలితాలలో 74వ ర్యాంక్‌ సాధించారు. దేశ వ్యాప్తంగా 147మంది ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించగా కృష్ణ చైతన్య 74వ ర్యాంక్‌ సాధించారు. కృష్ణా జిల్లా విజయవాడకు చెందిన తుమ్మల రాజారావు, సుజాత దంపతుల కుమారుడు కృష్ణ చైతన్య ప్రస్తుతం రాష్ట్ర సచివాలయంలో పరిశ్రమలు, వాణిజ్య విభాగంలో అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు.

Updated Date - May 09 , 2024 | 02:08 AM