బటన నొక్కి అలిసిపోయిన జగనకు సెలవిద్దాం
ABN , Publish Date - May 09 , 2024 | 01:42 AM
బటన నొక్కి నొక్కి అలిసిపోయిన సీఎం జగన్మోహనరెడ్డికి ఇక సెలవు ఇద్దామని రాష్ట్ర ప్రజలకు టీడీపీ నాయకుడు వంగవీటి రాధా పిలుపునిచ్చారు.
గుంటూరు, మే 8(ఆంధ్రజ్యోతి): బటన నొక్కి నొక్కి అలిసిపోయిన సీఎం జగన్మోహనరెడ్డికి ఇక సెలవు ఇద్దామని రాష్ట్ర ప్రజలకు టీడీపీ నాయకుడు వంగవీటి రాధా పిలుపునిచ్చారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని శ్రీని వాసరావుపేటలో బుధవారం ఆయన పర్యటించారు. గుంటురు పశ్చిమ నియోజ కవర్గ టీడీపీ-జనసేన-బీజేపీ ఉమ్మడి అభ్యర్థి గళ్లా మాధవి, ఎన్డీయే కూటమి నేతలతో కలిసి వంగవీటి రాధా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే వైసీపీ రాష్ట్ర ప్రజలను కులాలు, మతాలవారీగా విడ గొట్టిందని ఆరోపించారు. కాపులందరూ కలిసికట్టుగా ఉన్నామని నిరూపించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఈ ఎన్నికల్లో ఇచ్చే తీర్పు భావితరాలకు ఉజ్వల భవిష్యత్తునిస్తుందన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థి గళ్లా మాధవిని గెలిపించాలని కోరారు. ఇప్పటికే కూటమి అభ్యర్థుల విజ యం పక్కా అన్నారు. చంద్రబాబుతోనే సుపరిపాలన సాధ్యమన్నారు. ఈ సంద ర్భంగా గళ్లా మాధవి మాట్లాడుతూ విభజించు పాలించు తరహాలో జగన పాలన ఉందని ఆరోపించారు. కుటుంబ సభ్యుల మద్దతే వైసీపీకి లేదని ఎద్దేవా చేశారు. రేపు తన గెలుపు నిజాయితీ వైపు ఉంటుందని స్పష్టం చేశారు. తన కుటుంబం రోజురోజుకూ పెరిగిపోతోందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మల్లెల రాజేష్ నాయుడు, ఉగ్గిరాల సీతారామయ్య, భీమనాధం భరతరెడ్డి, గళ్లా రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.