Share News

Kadambari Jithvani: ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌కు జిత్వానీ.. వారిపై ఫిర్యాదు

ABN , Publish Date - Sep 13 , 2024 | 07:42 PM

వైసీపీ హయాంలో వేధింపులకు గురైన ముంబయి సినీ నటి కాదంబరీ జిత్వానీ శుక్రవారం విజయవాడకు చేరుకున్నారు. అనంతరం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో పలువురిపై ఫిర్యాదు చేశారు.

Kadambari Jithvani: ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌కు జిత్వానీ.. వారిపై ఫిర్యాదు

ఇబ్రహీంపట్నం: వైసీపీ హయాంలో వేధింపులకు గురైన ముంబయి సినీ నటి కాదంబరీ జిత్వానీ శుక్రవారం విజయవాడకు చేరుకున్నారు. అనంతరం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో పలువురిపై ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు కాపీని సీఐ చంద్రశేఖర్‌కు అందజేశారు. తనను అక్రమంగా నిర్బంధించి, చిత్రహింసలకు గురి చేసినట్లు లిఖితపూర్వక ఫిర్యాదులో పేర్కొన్నారు. విద్యాసాగర్ తనను మానసికంగా వేధించారని ఆమె ఆరోపించారు.

ఆయనతోపాటు మరో ముగ్గురు ఐపీఎస్‌లు పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా, విశాల్ గున్నీపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. విద్యాసాగర్ సహా ఐపీఎస్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో జిత్వానీ కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు.

For Latest News and National News click here

Updated Date - Sep 13 , 2024 | 07:43 PM