Home » Vijayawada
విజయవాడ: 2024-25 కేంద్ర బడ్జెట్లో ఏపీపై వరాల జల్లు కురిసింది. ఈ బడ్జెట్ చాలా ఉపయోగకరంగా ఉందని సీఐఐ ఛైర్మన్ మురళి అన్నారు. కేంద్ర బడ్జెట్పై సీఐఐ (భారత పరిశ్రమల సమాఖ్య) ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహిస్తున్నామన్నారు. రాజధాని అభివృద్దికి రూ. 15 వేల కోట్ల ఆర్ధిక సాయం ప్రకటించడం సంతోషమన్నారు.
Andhrapradesh: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఢిల్లీలో ధర్నా చేస్తానంటూ జగన్ ఇచ్చిన స్టేట్మెంట్పై ఆయన మండిపడ్డారు. ‘‘జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా చేస్తాడంట’’ అంటూ ఎద్దేవా చేశారు. ఐదేళ్లల్లో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ కోరాలన్నారు.
ప.గో.జిల్లా: నరసాపురం ఎంపీడీవో ఎం. వెంకటరమణా రావు అదృశ్యం కేసులో ట్విస్ట్ నెలకొంది. ఎంపీడీవో అదృశ్యంపై ఫెర్రీ బకాయిదారు రెడ్డప్ప ధవేజీ స్పందించారు. ప్రభుత్వానికి తాను రూ. 50 లక్షలు బాకీ ఉన్న మాట నిజమేనని, దానికి సంబంధించి గ్యారంటీ నిమిత్తం ప్రభుత్వానికి కొన్ని డాక్యుమెంట్లు ఇచ్చామన్నారు.
నరసాపురం ఎంపీడీవో ఎం.వెంకట రమణారావు ఆచూకీ కోసం ముమ్మరంగా గాలింపు కొనసాగుతోంది. ఒక పక్క పోలీసు, మరోపక్క ఎన్డీఆర్ఎఫ్ బృందాలు విస్తృతంగా గాలిస్తున్నాయి.
Andhrapradesh: వైసీపీ భూతానికి సీఎం చంద్రబాబు సమాధి కట్టారని టీడీపీ అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... అరుంధతి సినిమాలో పశుపతిలా... సమాధి నుంచి వైసీపీ ఫేక్ ప్రచారాలు చేస్తోందని వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వాన్ని ఇరికించేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. హత్యలు, అరాచకాలంటూ అబద్దాలు ఆడుతున్నారని అన్నారు. వైసీపీ నేతలే విషం పెట్టి... కూటమిపై నెట్టేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Andhrapradesh: జర్నలిస్టులు, మీడియాపై రాజ్యసభ సభ్యులు విజసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో పెను దుమారాన్ని రేపుతున్నాయి. విజయసాయిరెడ్డిపై మీడియా ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, ధర్నాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు మీడియాపై విజయసాయి చేసిన కామెంట్స్ను టీడీపీ నేత బుద్దా వెంకన్న తప్పుబట్టారు.
అమరావతి: పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీడీవో ఎం.వెంకటరమణారావు అదృశ్యంపై సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఎంపీడీవో అదృశ్యంపై సమగ్ర దర్యాప్తు చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కోరారు. కాగా స్థానిక ఎమ్మెల్యే బోడె ప్రసాద్ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి మనో ధైర్యం చెప్పారు.
విజయవాడ: తెలుగుదేశం సీనియర్ నేత బుద్దా వెంకన్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజలు వాతలు పెట్టినా ఇంకా జగన్కు బుద్ధి రాలేదని, పేర్ని నానికి శ్వేత పత్రం అంటే ఏంటో తెలుసా అని ప్రశ్నించారు.
Andhrapradesh: వైసీపీ పాలనలో భూ ఆక్రమణలు , కబ్జాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేసిన శ్వేతపత్రం వాస్తవాలను తెలియజేసిందని ఏపీ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... భూ కబ్జాదారుల ఆలన పాలనలో వైసీపీ పాలన సాగిందని విమర్శించారు. వైసీపీ నాయకులు మూడు రాజధానులని మభ్య పెట్టి మూడు ప్రాంతాలలో అన్ని రకాల భూముల దోపిడీ చేశారని ఆరోపించారు.
గుంటూరు జిల్లా: ఇటీవల గుంటూరులో సంచలనం రేపిన కిడ్నీ రాకెట్ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. గుంటూరుకు చెందిన వ్యక్తికి రూ. 30 లక్షలు ఇస్తామని ఆశ చూపించి కేవలం లక్ష రూపాయలు మాత్రమే చేతిలో పెట్టి మోసం చేశారు.