Share News

జ్వరం వచ్చిన వెంటనే రక్త పరీక్షలు చేయించుకోవాలి

ABN , Publish Date - Aug 28 , 2024 | 11:55 PM

జ్వరం వచ్చిన వెంటనే రక్త పరీక్షలు చేయించుకోవాలని మలేరి యా సబ్‌-యూనిట్‌ అధికారి సి ద్దయ్య పేర్కొన్నారు.

జ్వరం వచ్చిన వెంటనే రక్త పరీక్షలు చేయించుకోవాలి
సైఫోత్రిన పిచికారీని పరిశీలిస్తున్న సిద్ధయ్య

సింహాద్రిపురం, ఆగస్టు 28: జ్వరం వచ్చిన వెంటనే రక్త పరీక్షలు చేయించుకోవాలని మలేరి యా సబ్‌-యూనిట్‌ అధికారి సి ద్దయ్య పేర్కొన్నారు. శుక్రవారంలో మడ గ్రామంలో ఇంటింటా ఫీవర్‌ సర్వే నిర్వహించి ప్రజలకు మలేరియా, డెంగ్యూ వ్యాధుల గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మలేరియా సబ్‌ యూనిట్‌ అధికారి సిద్ధయ్య మాట్లాడుతూ ఆరోగ్య కార్యకర్తలు ప్రతి గ్రామాన్నీ సందర్శించి జ్వరం వచ్చిన వారికి రక్తపూతలు సేకరించి వారానికి మూడుసార్లు ల్యాబ్‌కు అందజేయాలన్నారు. మలేరియా నిర్ధారణ అయితే వెంటనే చికిత్స అందించాలన్నారు.

Updated Date - Aug 28 , 2024 | 11:55 PM