Share News

‘నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలి’

ABN , Publish Date - Aug 29 , 2024 | 12:08 AM

ఎస్సీ కార్పొరేషన ద్వారా జిల్లాకు మంజూరైన ఆటో లు, ట్రాక్టర్లను అర్హులైన ని రుద్యోగ యువతకు పంపి ణీ చేయాలని పీఆర్‌ఎ్‌సవైఎఫ్‌ రాష్ట్ర కన్వీనరు శంకర్‌ డిమాండ్‌ చేశారు.

‘నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలి’
ఈఓకు వినతిపత్రం అందిస్తున్న పీఆర్‌ఎస్‌ వైఎఫ్‌ కన్వీనర్‌ శంకర్‌

కడప (ఎడ్యుకేషన), ఆగస్టు 28: ఎస్సీ కార్పొరేషన ద్వారా జిల్లాకు మంజూరైన ఆటో లు, ట్రాక్టర్లను అర్హులైన ని రుద్యోగ యువతకు పంపి ణీ చేయాలని పీఆర్‌ఎ్‌సవైఎఫ్‌ రాష్ట్ర కన్వీనరు శంకర్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం కలెక్టరేట్‌లోని ఎస్సీ కార్పొరేషన కార్యాలయంలో పీఓ రవీంద్రనాథరెడ్డికి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో స్వచ్ఛ సంకల్ప కార్యక్రమాన్ని మున్సిపల్‌ కార్పొరేషన పరిధిలో మెకనైజ్డ్‌ డ్రయిన కీన్లింగ్‌ కోసం ఎస్సీ ఆర్థిక అభివృద్ధి సంస్థ నిధుల నుంచి జిల్లాకు ఆటోలు, ట్రాక్టర్లు. స్ర్పేయింమిషన్లు మంజూరు చేసిందన్నారు. అయితే వీటిలో కొన్నింటికి మాత్రమే పంపిణీ చేసి మిగిలిన వాటిని కడప నగరం మహిళా ప్రాంగణంలో ఉంచారని, వీటిని అర్హులైన వారికి పంపిణీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీఆర్‌ఎ్‌సవైఎఫ్‌ జిల్లా కన్వీనరు ఓరుగంటి నాగేంద్రబాబు, నాయకులు శ్రీనాధ్‌, విష్ణు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 29 , 2024 | 12:08 AM