Share News

జీవో 85కు వ్యతిరేకంగా ప్రభుత్వ వైద్యుల ఆందోళన

ABN , Publish Date - Sep 10 , 2024 | 11:45 PM

జీవో 85కు వ్యతిరేకంగా పీహెచసీల్లోని వైద్యులు మంగళ వారం నల్లరిబ్బన ధరించి నిరసన వ్యక్తం చేశారు. పదో తేదీ నుంచి ఆందోళన చేస్తామని తెలిపారు.

జీవో 85కు వ్యతిరేకంగా ప్రభుత్వ వైద్యుల ఆందోళన
ఓబులవారిపల్లె:నల్లరిబ్బన ధరించి విధులు నిర్వహిస్తున్న డాక్టర్‌ గురుమహేష్‌

ఓబులవారిపల్లె, సెప్టెంబరు 10: జీవో 85కు వ్యతిరేకంగా పీహెచసీల్లోని వైద్యులు మంగళ వారం నల్లరిబ్బన ధరించి నిరసన వ్యక్తం చేశారు. పదో తేదీ నుంచి ఆందోళన చేస్తామని తెలిపారు. ఈ జీవో ద్వారా తమ మూడేళ్ల సర్వీసు అర్థంలేకుండా పోతుందని, దీంతో తమ ప్రగతికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని వాపోయా రు. గత రెండు నెలలుగా జీవో 85 రద్దు చేయమని అధికారులకు, శాసనసభ్యులకు అర్జీ లు సమర్పించినా ఇప్పటివరకు ఎటువంటి స మాధానం రాలేదని వైద్యులు నిరాశ వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ గురు మహేష్‌, డాక్టర్‌ దీప, సీహెచవో నాగేష్‌ తదిత రులు పాల్గొన్నారు.

సుండుపల్లె: సుండుపల్లె మండలంలోని రాయవరం ప్రాథమి క వైద్య కేంద్రంలో ఉన్న వైద్యులు నిరసన తెలియ జేశారు. మంగళవారం ప్రాథమిక వైద్య కేంద్రం ఆవరణంలో నల్ల బ్యాడ్జీలతో తమ నిరస నను తెలి యజేశారు. ఈ జీవో ద్వారా తమ మూడేళ్ల సర్వీసు అర్థం లేకుండా పోతుందని ఇలా ఆకస్మాత్తుగా జీవో మార్చడం అన్యాయమ న్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Sep 10 , 2024 | 11:45 PM