Share News

కురుబ కులస్థుల ఆర్థిక ప్రగతికి కృషి చేస్తా

ABN , Publish Date - May 08 , 2024 | 12:05 AM

సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపి స్తే కురుబల కులస్థుల ఆర్థిక ప్రగతికి కృషి చేస్తానని మదనపల్లె అసెంబ్లీ కూటమి అభ్యర్థి షాజహానబాషా పిలు పునిచ్చారు.

కురుబ కులస్థుల ఆర్థిక ప్రగతికి కృషి చేస్తా
సమావేశంలో మాట్లాడుతున్న కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఎం, షాజహానబాషా

మదనపల్లె అర్బన, మే 7: సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపి స్తే కురుబల కులస్థుల ఆర్థిక ప్రగతికి కృషి చేస్తానని మదనపల్లె అసెంబ్లీ కూటమి అభ్యర్థి షాజహానబాషా పిలు పునిచ్చారు. మంగళవారం స్థానిక శ్రీరామకళ్యాణ మండపంలో కురుబ సంఘం నేత బిల్లే రెడ్డిప్రసాద్‌, మేస్త్రీ చంద్ర ఆధ్వర్యంలో కురబకులస్థుల ఆత్మీ య సమావేశం నిర్వహించారు. ఈసమావేశానికి ముఖ్యఅతిఽథిగా హాజరైన షాజహానబాషా మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కురుబల సమస్యలను అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. కురుబల కోసం ప్రత్యేక చట్టం, సబ్‌ప్లాన, 50 ఏళ్లు నిండినవారికి ఫించన, తదితర పథకాలను అమలు చేయడానికి కృషిచేస్తా మని తెలిపారు. ఈ నెల 13న జరిగే ఎన్నికల్లో సైకిల్‌ గుర్తుపై తనను, రాజంపేట పార్లమెంట్‌ కూటమి అభ్యర్థి నల్లారికిరణ్‌కుమార్‌రెడ్డిని కమలం గుర్తుపై ఓటు వేసి అత్యధికమెజార్టీతో గెలిపించాలని ఆయన అభ్యర్థించారు. .రామసముద్రం మండలం, భవనశానికురవపల్లె గ్రామం లో ఆలయ నిర్మాణం కోసం మేస్త్రీచంద్ర రూ. 21,116 విరాళంగా నగదును గ్రామస్థులకు రాటకొం డబాబురెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి షాజహానబాషా చేతులమీదుగా అందజేశారు. అందరూ కురుబ సంఘం నేతలు టీడీపీ మద్దతు పలికి షాజహానబాషాను అధిక మెజార్టీతో గెలిపిస్తామని భరోసా ఇచ్చారు. కాగా తొలుత పూలమాల, దుశ్శాలువతో సత్కరించి గొర్రెపిల్లను బహుకరించారు. కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరాంచినబాబు, టీడీపీ మైనార్టీ నేత ఎస్‌ఏ మస్తాన, ఎంపీటీసీ బిల్లేహారతి, మాజీ సర్పంచలు ఆర్కేశీన, తవళం రాజన్న, రెడ్డెప్ప, వీకోట నాగభూషణం, మాజీ కౌన్సిలర్లు కప్పలవెంకటరమణ, కప్పలరాజన్న, బీజేపీ నాయకుడు భువనే శ్వర్‌ సత్య, కురుబసంఘం నాయకులు మేజారీ మురళిధర్‌, అశోక్‌, వేణుగోపాల్‌, మేస్త్రీచంద్ర, చలా, రామిరెడ్డి, సదాశివ, తరిగొండ సురేంద్ర, రామిరెడ్డిగారిపల్లె వేణుగోపాల్‌, కృష్ణ పాల్గొన్నారు.

Updated Date - May 08 , 2024 | 12:05 AM