Share News

విజయవాడకు రాయచోటి మున్సిపల్‌ సిబ్బంది

ABN , Publish Date - Sep 05 , 2024 | 11:35 PM

విజయవాడ వరదలో చిక్కుకున్న ప్రజలకు సహాయ సహకారాలు అందించేందుకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి ఆదేశాల మేరకు గురువారం ఆయన సోదరుడు లక్ష్మిప్రసాద్‌రెడ్డి ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేసి రాయచోటి మున్సిపల్‌ సిబ్బందిని విజయవాడకు పంపించారు.

విజయవాడకు రాయచోటి మున్సిపల్‌ సిబ్బంది
జెండా ఊపి బస్సును ప్రారంభిస్తున్న లక్ష్మిప్రసాద్‌రెడ్డి

రాయచోటిటౌన్‌, సెప్టెంబరు 5: విజయవాడ వరదలో చిక్కుకున్న ప్రజలకు సహాయ సహకారాలు అందించేందుకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి ఆదేశాల మేరకు గురువారం ఆయన సోదరుడు లక్ష్మిప్రసాద్‌రెడ్డి ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేసి రాయచోటి మున్సిపల్‌ సిబ్బందిని విజయవాడకు పంపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడను వరదలు చుట్టుముట్టడంతో అక్కడి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్న విషయం అందరికీ విధితమేనన్నారు. ఇందులో భాగంగానే మంత్రి రాంప్రసాద్‌రెడ్డి విజయవాడ ప్రజల కోసం ఆహార పొట్లాలతో పాటు పండ్లు, తాగునీరు పంపిణీ చేశారన్నారు. ప్రతిఒక్కరూ మానవత్వంతో తమవంతు సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశ్యంతోనే రాయచోటి నుంచి మున్సిపల్‌ సిబ్బందిని అక్కడికి పంపిస్తున్నట్లు తెలిపారు.

Updated Date - Sep 05 , 2024 | 11:35 PM