Home » Bus Yatra
విజయవాడ వరదలో చిక్కుకున్న ప్రజలకు సహాయ సహకారాలు అందించేందుకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి ఆదేశాల మేరకు గురువారం ఆయన సోదరుడు లక్ష్మిప్రసాద్రెడ్డి ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేసి రాయచోటి మున్సిపల్ సిబ్బందిని విజయవాడకు పంపించారు.
దాదాపు 40 మంది భారతీయ టూరిస్టులతో వెళ్తున్న బస్సు(bus) ఘోర ప్రమాదానికి(accident) గురైంది. అబుఖైరేని, తనహున్ సమీపంలోని మర్స్యంగ్డి నదిలో బస్సు పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 14 మంది ప్రయాణికులు మరణించారు.
ఇటివల అనేక చోట్ల పాఠశాలలు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఆ క్రమంలోనే స్కూల్ పిల్లలను పాఠశాలకు తీసుకెళ్తున్న వ్యాన్లు, బస్సుల విషయంలో మాత్రం పేరెంట్స్ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ వాహనాలు అనేక చోట్ల ప్రమాదాలకు గురవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా విద్యార్థులను తీసుకెళ్తున్న ఓ మినీ బస్సును పికప్ ట్రక్ వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది(accident). దీంతో అందులో ఉన్న స్కూల్ విద్యార్థుల్లో 12 మంది, డ్రైవర్ కూడా మృత్యువాత చెందగా, మరో ఏడుగురు గాయపడ్డారు.
బుధవారం ఉదయం ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) ఉన్నావ్(Unnao)లోని ఆగ్రా-లక్నో ఎక్స్ప్రెస్వేపై ఘోర ప్రమాదం(accident) చోటుచేసుకుంది. బీహార్లోని మోతిహారి నుంచి ఢిల్లీకి వెళ్తున్న డబుల్ డెక్కర్ బస్సు పాల ట్యాంకర్ను ఢీకొనడంతో 18 మంది మృత్యువాత చెందగా, మరో 30 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు.
జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులు దారుణానికి పాల్పడ్డారు. యాత్రికులతో వెళ్తున్న బస్సుపై కాల్పులకు తెగబడ్డారు. రియాసీ జిల్లాలోని శివ్ ఖోడీ ఆలయాన్ని సందర్శించుకున్న యాత్రికులు కాట్రాకు వెళ్తుండగా ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో పోని ప్రాంతంలోని తెర్యాత్ గామ్రం వద్ద ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.
కర్నూలు జిల్లా: కోడుమూరు సమీపంలో గురువారం తెల్లవారుజామున ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 40 మందికి పైగా ప్రయాణీకులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఇంకా బస్సులో కొందరు ప్రయాణీకులు చిక్కుకున్నారు.
హర్యానాలో ఘోర ప్రమాదం జరిగింది. హర్యానాలో గల నుహ్ వద్ద కుంద్లీ మనేసర్ పల్వాల్ ఎక్స్ప్రెస్ వే పై ఓ బస్సుకు మంటలు అంటుకున్నాయి. ప్రమాదం సమయంలో బస్సులో 64 మంది ఉన్నారు. వారంతా బృందావనంలో శ్రీకృష్ణుడిని దర్శించుకొని తిరిగి వస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో అధిక స్థానాలు గెలుచుకోవడమే లక్ష్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్రను ప్రారంభించారు. 17 రోజుల పాటు తెలంగాణలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో కేసీఆర్ పర్యటించనున్నారు. ఇప్పటికే కరీంనగర్, చేవెళ్ల, మెదక్ బహిరంగ సభల్లో పాల్గొన్న ఆయన ఈరోజు నుంచి రోడ్ షోల ద్వారా ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయనున్నారు.
ఏపీలో వరుసగా రెండోసారి అధికారం కోసం వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. వై నాట్ 175 నినాదంతో ముందుకెళ్లిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయం సమీపిస్తున్న కొద్దీ ఆ నినాదాన్ని పక్కనపెట్టినట్లు తెలుస్తోంది. జనం నాడిని పసిగట్టిన జగన్ అధికారానికి కావల్సిన మెజార్టీ మార్క్పై ప్రధానంగా దృష్టిపెట్టారు. తాము అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో తాము సునాయసంగా గెలుస్తామని భావించిన వైసీపీ ఆశలు ఫలించేట్లు కనిపించడంలేదు. ప్రజలు ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకతతో ఉన్నారో జగన్కు మేమంతా బస్సు యాత్రలో స్పష్టంగా కనిపించింది.
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ‘మేమంతా సిద్ధం’ పేరుతో సీఎం జగన్మోహన్రెడ్డి గత ఇరవై రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఆదివారం జగన్ నగరంలో వేపగుంట జంక్షన్ నుంచి పీఎం పాలెం వరకూ రోడ్షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన..