Share News

Road Accident: కర్నూలు జిల్లా, కోడుమూరు సమీపంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా

ABN , Publish Date - May 23 , 2024 | 06:47 AM

కర్నూలు జిల్లా: కోడుమూరు సమీపంలో గురువారం తెల్లవారుజామున ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 40 మందికి పైగా ప్రయాణీకులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఇంకా బస్సులో కొందరు ప్రయాణీకులు చిక్కుకున్నారు.

Road Accident: కర్నూలు జిల్లా, కోడుమూరు  సమీపంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా

కర్నూలు, ఆంధ్రజ్యోతి: జిల్లాలోని కోడుమూరు సమీపంలో గురువారం తెల్లవారుజామున ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా (Bus Accident) పడింది. ఈ ప్రమాదంలో 40 మందికి పైగా ప్రయాణీకులకు (Passengers) తీవ్ర గాయాలు అయ్యాయి. ఇంకా బస్సులో కొందరు ప్రయాణీకులు చిక్కుకున్నారు. ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ (Hyderabad) నుంచి ఆదోని (Adoni) వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులు హాహాకారాలు చేస్తున్నారు.


ప్రమాదం ఎలా జరిగింది..?

బస్సు డ్రైవర్ అతి వేగంగా వెళుతూ.. మరో వాహనాన్ని ఓవర్ టెక్ చేసే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లుగా సమాచారం. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెండగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలియవచ్చింది. మృతులు లక్ష్మీ(13), గోవర్ధిని(8) వారు హైదరాబాద్ వాసులుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీకి ‘అష్ట’కష్టాలు!

కేంద్రానికి ఆర్బీఐ భారీ గిఫ్ట్‌

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 23 , 2024 | 07:54 AM