Share News

దోచుకున్న భూములను హక్కుదారులకు ఇప్పిస్తాం

ABN , Publish Date - Jul 25 , 2024 | 11:31 PM

తంబళ్లపల్లె నియోజకవర్గంలో గత వైసీపీ హయాం లో అధికారాన్ని అడ్డుపెట్టుకుని పెద్దిరెడ్డి కుటుంబం పేదల నుంచి కబ్జా చేసిన భూములను ప్రస్తుత కూటమి ప్రభుత్వ సహకారంతో మళ్లీ సొంత హక్కుదారుల కే అప్పగిస్తామని తంబళ్లపల్లె టీడీపీ నా యకులు పేర్కొన్నారు.

దోచుకున్న భూములను హక్కుదారులకు ఇప్పిస్తాం
మీడియా సమావేశంలో మాట్లాడుతున్న టీడీపీ నాయకులు

తంబళ్లపల్లె, జూలై 25: తంబళ్లపల్లె నియోజకవర్గంలో గత వైసీపీ హయాం లో అధికారాన్ని అడ్డుపెట్టుకుని పెద్దిరెడ్డి కుటుంబం పేదల నుంచి కబ్జా చేసిన భూములను ప్రస్తుత కూటమి ప్రభుత్వ సహకారంతో మళ్లీ సొంత హక్కుదారుల కే అప్పగిస్తామని తంబళ్లపల్లె టీడీపీ నా యకులు పేర్కొన్నారు. గురువారం తంబ ళ్లపల్లెలో ఏర్పాటు చేసిన సమావేశంలో టీడీపీ నాయకులు మాట్లాడుతూ...గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వంలో తంబళ్లపల్లె నియో జకవర్గవ్యాప్తంగా పెద్దిరెడ్డి కుటుంబం కొన్ని వందల ఎకరాల భూములను దోచుకున్నా రని ఆరోపించారు. ఈ భూ భాగోతం ఎక్కడ బయట పడుతుందనే నెపంతో మదనపల్లె సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో రికార్డులకు నిప్పు పెట్టి బూడిద చేయించారని ఆరోపించారు. రాబోయే రోజుల్లో తంబళ్లపల్లె టీడీపీ ఇనచార్జి జయచంద్రారెడ్డి ఆధ్వర్యంలో పెద్దిరెడ్డి కుటుంబం చేసిన భూ మాఫియా, ఇసుక మాఫియా అవినీతి అక్రమాలను బయటపెట్టి ప్రజలకు వివరిస్తామన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి, పార్ల మెంటు బీసీ సెల్‌ కార్యనిర్వాహక కార్యదర్శి సోముశేఖర్‌, జయరాంరెడ్డి, పురుషోత్తం, మూలపల్లె శేఖర, స్వామిరెడ్డి, నాగేంద్ర, మాజీ సర్పంచ శంకర, సాంబశివారెడ్డి, ఎమ్మార్పీ ఎస్‌ జగదీష్‌, అల్లావుద్దీన, రామ్మోహనరెడ్డి, రాజన్న సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 25 , 2024 | 11:31 PM