Share News

ఆపద్బాంధవుడు ఎమ్మెల్యే యార్లగడ్డ

ABN , Publish Date - Jul 27 , 2024 | 12:42 AM

రైతులకు ఆపద్బాంధ వుడిలా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు నిలిచారని టీడీపీ మండల అధ్యక్షుడు జాస్తి వెంకటేశ్వరరావు అన్నారు. రూ.కోటితో మోటార్లు కొనుగోలు చేసి రైతు లకు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అందజేయగా మండలంలోని కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన మో టార్లను శుక్రవారం జాస్తి ప్రారంభించారు.

 ఆపద్బాంధవుడు ఎమ్మెల్యే యార్లగడ్డ
కొత్తగూడెంలో మోటార్లు ఆన్‌ చేస్తున్న టీడీపీ మండల అధ్యక్షుడు జాస్తి వెంకటేశ్వరరావు

గన్నవరం, జూలై 26 : రైతులకు ఆపద్బాంధ వుడిలా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు నిలిచారని టీడీపీ మండల అధ్యక్షుడు జాస్తి వెంకటేశ్వరరావు అన్నారు. రూ.కోటితో మోటార్లు కొనుగోలు చేసి రైతు లకు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అందజేయగా మండలంలోని కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన మో టార్లను శుక్రవారం జాస్తి ప్రారంభించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతుల పక్షాన టీ డీపీ ఎప్పుడు ఉంటుందన్నారు. 120 రోజుల్లో పట్టిసీ మను పూర్తి చేసి గోదావరి జలాలను కృష్ణానదికి అనుసంధానం చేయటంతో పాటు అన్నదాతలకు నీరు అందజేసిన ఘనత చంద్రబాబు నాయుడుకే దక్కిందన్నారు. ఎన్నికల ముందు యార్లగడ్డను రైతులు మోటార్లు అందజేయాలని కోరారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా ఇచ్చి తీరతానని చెప్పి ఆ హామీని నిలబెట్టుకున్నారని తెలిపారు. రైతుల కష్టాలు, బాధలు ఎరిగిన వ్యక్తి ఎమ్మెల్యే యార్లగడ్డ అని చెప్పారు. తెలుగు రైతు, మండల అధ్యక్షులు ఆరుమళ్ల కృష్ణారెడ్డి, జూపల్లి సురేష్‌, మండవ అన్వేష్‌, చీమలదండు రామకృష్ణ, పోతురాజు, హేమంత్‌, రాంబాబు, గోపీ పాల్గొన్నారు.

Updated Date - Jul 27 , 2024 | 12:42 AM