Share News

వైసీపీకి భారీ షాక్‌

ABN , Publish Date - May 09 , 2024 | 01:27 AM

విజయవాడ పార్లమెంట్‌ నియోజకవర్గంలో వైసీపీకి భారీ షాక్‌ తగిలింది. బుధవారం గురునానక్‌కాలనీలోని ఎన్టీఆర్‌ భవన్‌లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్‌(చిన్ని) సమక్షంలో తిరువూరు, నందిగామ, విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి పలువురు నాయకులు, కార్యకర్తలు టీడీపీలో చేరారు.

వైసీపీకి భారీ షాక్‌
టీడీపీలో చేరిన తిరువూరు నియోజకవర్గ నాయకులతో కేశినేని చిన్ని

తిరువూరు, నందిగామ, విజయవాడ పశ్చిమ నియోజకవర్గాల నుంచి భారీగా టీడీపీలోకి చేరికలు

విద్యాధరపురం, మే 8: విజయవాడ పార్లమెంట్‌ నియోజకవర్గంలో వైసీపీకి భారీ షాక్‌ తగిలింది. బుధవారం గురునానక్‌కాలనీలోని ఎన్టీఆర్‌ భవన్‌లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్‌(చిన్ని) సమక్షంలో తిరువూరు, నందిగామ, విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి పలువురు నాయకులు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. తిరువూరు నియోజకవర్గం తిరువూరు రూరల్‌ మునకళ్ల గ్రామానికి చెందిన 50 మంది వైసీపీ కార్యకర్తలు, నాయకులు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముద్దరబోయిన వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. వారిలో కృష్ణాజిల్లా గొర్రెల మేకల పెంపకందారుల సహకార యూనియన్‌ మాజీ చైర్మన్‌ జి.రామకృష్ణయాదవ్‌, యాదవ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాచబంటి వెంకటాద్రియాదవ్‌, పరసా గోపీ కృష్ణ, పదిలం సత్యనారాయణ ఉన్నారు. నందిగామ నియోజకవర్గం నుంచి టీడీపీ కంచికచర్ల మండల అధ్యక్షుడు కోగంటి బాబు ఆధ్వర్యంలో వైసీపీ మండల అధ్యక్షుడు నన్నపనేని నరసింహరావు, వేములపల్లి సర్పంచ్‌ ఉయ్యూరు నరసింహారెడ్డి, నాయకులు గుడె శ్రీధర్‌, హనుమాన్‌రావు టీడీపీలో చేరారు. నన్నపనేని సాంబశివరావు, సీతారామరాజు, లక్ష్మీనారాయణ, బండారు పల్లి రాజు, ముక్కపాటి నరసింహరావు పాల్గొన్నారు. వీరులపాడు మండలం వెల్లంకి సర్పంచ్‌ షేక్‌ హుసేన్‌ బీ, ఆమె కుమారుడు షేక్‌ అబ్బి, వైసీపీ వార్డు సభ్యుడు కుడుపుగంటి యలమందతో పాటు 10 కుటుంబాల వారు టీడీపీలో చేరారు. నూకవరపు శ్రీనివాసరావు, చిరుమామిళ్ల కృష్ణ పాల్గొన్నారు. టీడీపీ స్టేట్‌ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ ఎంఎస్‌ బేగ్‌ ఆధ్వర్యంలో విజయవాడ పశ్చిమ నియోజక వర్గం నుంచి వైసీపీ మహిళా నాయకురాలు మోబీనా, నసీమా, సుల్తానాలు, 50వ డివిజన్‌కు చెందిన 100 మంది మహిళలు టీడీపీలో చేరారు. చెన్నుపాటి ఉషారాణి పాల్గొన్నారు.

Updated Date - May 09 , 2024 | 01:27 AM