Share News

మహంకాళి బోనాల జాతరకు దుర్గగుడి ఆషాఢ సారె

ABN , Publish Date - Jul 27 , 2024 | 01:15 AM

హైదరాబాద్‌లో మహంకాళి జాతర సందర్భంగా ఉమ్మడి ఆల యాల్లో అమ్మవార్లకు దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం తరఫున అధికారులు, అర్చకులు శుక్రవారం ఆషాఢ సారె, పట్టువస్త్రాలు సమర్పించారు.

మహంకాళి బోనాల జాతరకు దుర్గగుడి ఆషాఢ సారె
అమ్మవార్లకు పట్టువస్త్రాలు, ఆషాఢ సారె తీసుకెళుతున్న దుర్గగుడి బృందం

వన్‌టౌన్‌, జూలై 26: హైదరాబాద్‌లో మహంకాళి జాతర సందర్భంగా ఉమ్మడి ఆల యాల్లో అమ్మవార్లకు దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం తరఫున అధికారులు, అర్చకులు శుక్రవారం ఆషాఢ సారె, పట్టువస్త్రాలు సమర్పించారు. ప్రత్యేక అర్చనల అనంతరం అక్కడి ఆలయాల ఆచారాల మేరకు అధికారులు అర్చకులను సత్కరించారు. మహంకాళి బోనాల జాతర ఉమ్మడి దేవాలయాల కమిటీ చైర్మన్‌ ఆహ్వానం మేరకు దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం తరఫున సారె సమర్పించారు. ఈఈ లింగం రమాదేవి, ఏఈవో రమేష్‌ బాబు, ముఖ్య అర్చకుడు శ్రీనివాస శాస్త్రి పాల్గొన్నారు. ఉప్పుగూడలోని మహంకాళీ దేవాలయం, లాల్‌ దర్వాజాలోని సింహవాహిని మహంకాళి దేవాలయం, గౌలిపురలోని మహంకాళి దేవాలయం, సుల్తాన్‌ సాహిలోని జగదాంబ దేవాలయం, హరిభౌలిలోని బేల ముత్యాలమ్మ దేవాలయం, బంగారు మైసమ్మ దేవాలయం, అక్కన్న మాదన్న దేవాలయం, మీరాల మండిలోని మహంకాళేశ్వర ఆలయాల్లో సారె సమర్పించారు.

Updated Date - Jul 27 , 2024 | 01:15 AM