Share News

Samineni Udayabhanu: ఇంత ఘోర ఓటమెలా.. నిద్ర పట్టడం లేదు!

ABN , Publish Date - Jul 08 , 2024 | 08:34 AM

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి రాత్రింబవళ్లు ఆలోచిస్తునే ఉన్నా.. నిద్ర పట్టడంలేదు.. ఇంత ఘోర ఓటమి ఎలా పొందాం.. పేటలో పక్కా వార్డులలో పత్తా లేకుండా పోయాం..

Samineni Udayabhanu: ఇంత ఘోర ఓటమెలా.. నిద్ర పట్టడం లేదు!

విజయవాడ/జగ్గయ్యపేట: ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి రాత్రింబవళ్లు ఆలోచిస్తునే ఉన్నా.. నిద్ర పట్టడంలేదు.. ఇంత ఘోర ఓటమి ఎలా పొందాం.. పేటలో పక్కా వార్డులలో పత్తా లేకుండా పోయాం.. గ్రామాల్లోను అదే పరిస్థితి.. అని జగ్గయ్యపేట నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ఆవేదన వ్యక్తం చేశారు. కళ్లెదుటే ఇవీఎంలు సీల్‌ వేశారు.. తీశారు. అవకతవకలు జరిగాయి.. ఆధారాల్లేవు అంటూ వాపోయారు.

ఆదివారం బి.కన్వెన్షన్‌ హాలులో ఎన్నికల ఫలితాల అనంతరం తొలిసారి కార్యకర్తల సమావేశంలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో ఒక కార్యకర్త తరచు అడ్డు తగులుతుండటంతో ఆయన స్టేజి దిగి వచ్చి చేయిచేసుకుని బయటకు పంపించారు. ఈ సందర్భంగా ఎన్నికల ఫలితాల అనంతరం దాడుల్లో నష్టపోయిన ఆరుగురు కార్యకర్తలకు రూ.3.50లక్షల పరిహారాన్ని అందజేశారు. సమావేశంలో మాజీ చైర్మన్‌లు, మునిసిపల్‌ కౌన్సిలర్లు, పార్టీ నేతలు పాల్గొన్నారు.

Updated Date - Jul 08 , 2024 | 08:34 AM