Share News

కూటమి అధికారంలోకి రాగానే ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దు: కేశినేని చిన్ని

ABN , Publish Date - May 09 , 2024 | 01:29 AM

‘‘జగన్‌ తెచ్చిన నల్లచట్టం ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలోకి రాగానే చంద్రబాబు ఆ చట్టాన్ని రద్దు చేస్తూ రెండో సంతకం చేస్తారు.’’ అని కూటమి విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్‌(చిన్ని) హామీ ఇచ్చారు.

కూటమి అధికారంలోకి రాగానే ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దు: కేశినేని చిన్ని

విజయవాడ లీగల్‌: ‘‘జగన్‌ తెచ్చిన నల్లచట్టం ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌. దానికి వ్యతిరేకంగా న్యాయవాదులు చేసిన న్యాయపోరాటం ప్రజల్లో అవగాహన పెంచింది. వారిని చైతన్యవంతుల్ని చేసింది. న్యాయవాదుల కష్టానికి త్వరలోనే ఫలితం రాబోతుంది. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలోకి రాగానే చంద్రబాబు ఆ చట్టాన్ని రద్దు చేస్తూ రెండో సంతకం చేస్తారు.’’ అని కూటమి విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్‌(చిన్ని) హామీ ఇచ్చారు. బెజవాడ బార్‌ అసోసియేషన్‌లో బుధవారం కూటమి తూర్పు, సెంట్రల్‌ అభ్యర్థులు గద్దె రామ్మోహన్‌, బొండా ఉమాలతో కలిసి ఆయన న్యాయవాదులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కూటమికి మద్దతివ్వాలని గద్దె రామ్మోహన్‌, బొండా ఉమా అన్నారు. బార్‌ అధ్యక్షుడు కొత్త చంద్రమౌళి, కార్యదర్శి అరిగల శివరాంప్రసాద్‌(రాజా), గండూరి రామశర్మ, కల తోటి క్రాంతికుమార్‌, ఎస్‌.రాజ్యలక్ష్మి, చెన్నుపాటి ఉషారాణి, గడ్డం రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 09 , 2024 | 01:29 AM