ఏపీఈసెట్ ప్రవేశ పరీక్షకు 97.43 శాతం హాజరు
ABN , Publish Date - May 09 , 2024 | 12:39 AM
బీటెక్ సెకండ్ ఇయర్ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీఈసెట్-2024 పరీక్ష బుధవారం జరిగింది.
కర్నూలు(ఎడ్యుకేషన్), మే 8: బీటెక్ సెకండ్ ఇయర్ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీఈసెట్-2024 పరీక్ష బుధవారం జరిగింది. కర్నూలు జిల్లాలో పాలిటెక్నిక్ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు 1,244 మంది నమోదు చేసుకున్నారు. ఇందులో 1,212 మంది పరీక్షకు హాజరు కాగా 32 మంది గైర్హాజరయ్యారు. ఈ పరీక్ష ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో జరిగింది. మొదటి సెషన్స్లో 704 మందికి గానూ 681 మంది, రెండో సెషన్స్లో 540 మందికి గానూ 531 మంది పరీక్షకు హాజరయ్యారు. ఫైల్నెం.04