టీడీపీ, వైసీపీ వర్గీయుల వాగ్వాదం
ABN , Publish Date - May 09 , 2024 | 12:42 AM
దొర్నిపాడు మండలం డబ్యూ.కొత్తపల్లె గ్రామంలో ప్రచారం చేసుకునే విషయంలో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య బుధవారం వాగ్వాదం జరిగింది.
నంద్యాల, మే 8(ఆంధ్రజ్యోతి): దొర్నిపాడు మండలం డబ్యూ.కొత్తపల్లె గ్రామంలో ప్రచారం చేసుకునే విషయంలో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య బుధవారం వాగ్వాదం జరిగింది. నంద్యాల జిల్లా విజ య డెయిరీ మాజీ చైర్మన్ భూమా నారాయణరెడ్డి కుమారులైన దొర్ని పాడు మాజీ ఎంపీపీ భూమా బ్రహ్మానందరెడ్డి(టీడీపీ), దొర్నిపాడు మాజీ జడ్పీటీసీ భూమా వీరభద్రారెడ్డి (వైసీపీ) మధ్య వాగ్వాదం చోటు చేసు కుంది. ఆళ్లగడ్డ రూరల్ సీఐ హనుమంత నాయక్, పోలీసులు అక్కడకు చేరుకొని సమస్యను సద్దుమణిగించారు.