జగన్కు ఓటమి తప్పదు
ABN , Publish Date - May 09 , 2024 | 12:42 AM
సార్వత్రిక ఎన్నికల్లో జగన్కి ఓటమి తప్పదని కర్నూలు టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు అన్నారు.
ప్రాజెక్టులు నిర్మించి రైతాంగానికి సాగు నీరు అందిస్తాం
కర్నూలు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు
గూడూరు, మే 8: సార్వత్రిక ఎన్నికల్లో జగన్కి ఓటమి తప్పదని కర్నూలు టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు అన్నారు. బుధవారం గూడూరు మండలంలోని చనుగొండ్ల, వై ఖానాపురం గ్రామాల్లో కర్నూలు జిల్లా టీడీపీ నాయకుడు విష్ణువర్థన్ రెడ్డి సారధ్యంలో కోడుమూరు టీడీపీ అభ్యర్థి బోగ్గుల దస్తగిరితో కలిసి కర్నూలు టీడీపీ పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ, బీజేపీ, జనసేన శ్రేణులకు పూలమాలలతో జనం నీరాజనం పలికారు. ఈ సందర్భంగా కర్నూలు టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ వైసీపీ పాలనతో విసిగిపోయిన జనం, ఓటుతోనే వైసీపీకి బుద్ధి చెప్పేందుకు సిద్ధమయ్యారన్నారు. సొంత కుటుంబ సభ్యులే జగన్కు ఓటు వెయ్యొందటున్నారన్నారు. ఇక ప్రజలు జగన్కు ఎలా ఓట్లు వేస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో టీడీపీ ప్రభంజనం సృష్టించబోతుందన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం బాగుపడుతుందని ప్రజలు నమ్ముతున్నారన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి ఈ ప్రాంత రైతాంగానికి సాగునీరు అందించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో చనుగొండ్ల, వై ఖానాపురం టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.