పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలు
ABN , Publish Date - May 09 , 2024 | 12:40 AM
జిల్లాలో మే 13న సజావుగాఎన్నికలు నిర్వహించడానికి పోలింగ్ కేంద్రాల్లో అన్ని సదుపాయాలు కల్పించామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా.జి. సృజన బుధవారం తెలిపారు.
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జి.సృజన
కర్నూలు(కలెక్టరేట్), మే 8: జిల్లాలో మే 13న సజావుగాఎన్నికలు నిర్వహించడానికి పోలింగ్ కేంద్రాల్లో అన్ని సదుపాయాలు కల్పించామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా.జి. సృజన బుధవారం తెలిపారు. పోలింగ్ స్టేషన్లలో నిర్దేశిత మౌలిక వసతులు ఏర్పాటు చేయడంతో పాటు మొత్తం 2204 పోలింగ్ కేంద్రాల్లో 4408 కెమెరాలు ఏర్పాటు చేసి పోలింగ్ పర్యవేక్షణకు 318 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించామని తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో నీటి సౌకర్యంతో రెండు టాయిలెట్లును ఏర్పాటు చేశామన్నారు. ర్యాంప్స్, విద్యుత్ సౌకర్యం కల్పించామని అన్నారు. పోలింగ్ రోజున తాగునీరు, టేబుల్స్ చైర్స్తో పాటు షెడ్లు, బ్యారికేడింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద తగిన భద్రతను ఏర్పాటు చేశామని తెలిపారు.