Share News

జగన్‌ను ఇంటికి పంపిద్దాం

ABN , Publish Date - May 09 , 2024 | 12:45 AM

దుర్మార్గుడైన జగన్మోహన్‌రెడ్డిని ఈనెల 13న ఓటు అనే ఆయుధంతో ఇంటికి పంపాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి పిలుపునిచ్చారు.

జగన్‌ను ఇంటికి పంపిద్దాం

చంద్రబాబు ఆర్యవైశ్యులకు అండ: సోమిశెట్టి

కర్నూలు(అర్బన్‌), మే 8: దుర్మార్గుడైన జగన్మోహన్‌రెడ్డిని ఈనెల 13న ఓటు అనే ఆయుధంతో ఇంటికి పంపాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి పిలుపునిచ్చారు. బుధవారం తెలుగుదేశం పార్టీ కార్యాలంయలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐదేళ్ల పాలనలో వైశ్యులు ఆర్ధికంగా ఎంతో నష్టపోయారని, ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు వస్తేనే వ్యాపారాలు చేసుకునే పరిస్థితి ఉంటుందన్నారు. వైశ్యులకు మొదటి నుంచి చంద్రబాబు నాయుడు అండగా ఉంటూ పన్నుల భారం లేకుండా అన్ని విధాలుగా అండగా ఉంటు ఆదుకుంటారని భరోసా ఇచ్చారు. ఇటివల వైశ్యుల సమస్యలను రాష్ట్ర వైశ్య సంఘం నాయకులతో కలిసి వివరించానని తెలిపారు. జగన్‌రెడ్డి పాలనలో ఎంతో నష్టపోయామని తెలిపారు. అలాగే కర్నూలు జిల్లా పర్యటనకు వస్తున్న ఆయన ఉమ్మడి జిల్లాకు ఎలాంటి న్యాయం చేశావో చెప్పాలని ప్రశ్నించారు. న్యాయ రాజధాని లేదు.. నీటి ప్రాజెక్టులు లేవు., చివరకు సంక్షేమం, అభివృద్ధి ఉసే లేకుండా చేసిన నీకు ఎలా ఓట్లేయాలని ప్రజలు నీలదీస్తారని హెచ్చరించారు. చంద్రబాబు నాయకత్వంలోనే జిల్లాకు త్రిబుల్‌ ఐటీ, ఉర్దూ యూనివర్సిటీ, ఓర్వకల్లు ఇండస్ట్రియల్‌హబ్‌తో పాటు ఎన్నో పరిశ్రమలు, కేంద్ర విద్యా సంస్థలు జిల్లాకు వచ్చాయని గుర్తు చేశారు. అభివృద్ధి చేసే చంద్రబాబుకు రాష్ట్ర ప్రజలు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. జగన్‌ జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని, పోలింగ్‌ ఆయ్యాక ఆయన పెట్టె సర్దుకుని పారిపోయే పరిస్థితి ఉందన్నారు.

Updated Date - May 09 , 2024 | 12:45 AM