Share News

మల్లన్న సన్నిధిలో కార్మిక శాఖ మంత్రి

ABN , Publish Date - Jul 26 , 2024 | 11:50 PM

శ్రీశైల మల్లికార్జున స్వామి, భ్రమరాంబ అమ్మవార్లను శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సురేష్‌ దర్శించుకున్నారు.

మల్లన్న సన్నిధిలో కార్మిక శాఖ మంత్రి
మంత్రి సురేష్‌కు స్వాగతం పలుకుతున్న ఈవో పెద్దిరాజు

శ్రీశైలం, జూలై 26: శ్రీశైల మల్లికార్జున స్వామి, భ్రమరాంబ అమ్మవార్లను శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సురేష్‌ దర్శించుకున్నారు. దర్శనార్థం ఆలయ రాజగోపురం వద్దకు వచ్చిన ఎమ్మెల్యేకు ఆలయ అధికారులు, అర్చకులు సాదర స్వాగతం పలికారు. అనంతరం వారు స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. అంతకముందు శ్రీశైల భ్రమరాంబ అతిథి వసతి గృహానికి చేరుకున్న మంత్రి వాసమ్‌సెట్టి సురేష్‌కు ఆలయ కార్యనిర్వహణాధికారి డి.పెద్దిరాజు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు.

Updated Date - Jul 26 , 2024 | 11:50 PM