పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల
ABN , Publish Date - May 09 , 2024 | 12:41 AM
పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి.
జిల్లాలో 87.95 శాతం ఉత్తీర్ణత
ప్రశాంత్ కుమార్కు 160వ రాష్ట్ర ర్యాంకు
కర్నూలు(ఎడ్యుకేషన్), మే 8: పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. గత నెల 27వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ కళాశాలల ప్రవేశాల కోసం పరీక్ష జరిగింది. కర్నూలు జిల్లాలో మొత్తం 7246 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు. ఈ పరీక్షలో 6373 మంది పాసై 87.95 శాతం ఉత్తీర్ణత సాదించారు. ఇందులో బాలురు 4355 మంది పాసై 89.68 శాతం, బాలికలు 2018 మంది పాసై 84.44 శాతం ఉత్తీర్ణత సాధించారు. కోడుమూరుకు చెందిన చేనేత కుటుంబానికి చెందిన గోపాల్ కుమారుడు జి.ప్రశాంత్ కుమార్ 115 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 160వ ర్యాంకు సాధించారు. అలాగే పత్తికొండకు చెందిన కునిగిరి మనోజ్ 113 మార్కులతో 250వ ర్యాంకును, కర్నూలు నగరం రాఘవేంద్రనగర్కు చెందిన పింజరి మహ్మద్ హర్షద్ 110 మార్కులతో386 వ ర్యాంకును సాదించి జిల్లాలో అగ్రస్థానంలో నిలిచారు.
పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో చేనేత కుటుంబానికి చెందిన గోపాల్ కుమారుడు ప్రశాంత్ కుమార్ రాష్ట్ర స్థాయిలో 115 మార్కులతో 160వ ర్యాంకును సాధించారు.