వైసీపీకి ఓటుతో బుద్ధి చెప్పండి
ABN , Publish Date - May 09 , 2024 | 12:40 AM
సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలని నంద్యాల జిల్లా పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మీనరసింహయాదవ్, డోన్ ఎమ్మెల్యే అభ్యర్థి గార్లపాటి మద్దిలేటి పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి లక్ష్మీనరసింహయాదవ్
డోన్(రూరల్), మే 8: సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలని నంద్యాల జిల్లా పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మీనరసింహయాదవ్, డోన్ ఎమ్మెల్యే అభ్యర్థి గార్లపాటి మద్దిలేటి పిలుపునిచ్చారు. బుధవారం పట్టణంలోని ప్రధాన రోడ్డులో ఇండియా కూటమి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం పాతబస్టాండులో జరిగిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక హోదా రాష్ట్రానికి సాధిస్తామని ప్రగల్బాలు పలికిన జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చి 22 మంది ఎంపీలు ఉన్నా పార్లమెంటు వేదికగా ఐదేళ్లలో ఒక్కసారిగా ప్రత్యేక హోదాపై మాట్లాడింది లేదని ధ్వజమెత్తారు. జాబ్ క్యాలెండర్ అని నిరుద్యోగులను మోసం చేసిన ఘనత వైసీపీకే దక్కుతుందన్నారు. ఎన్నికల సమయంలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి మోసం చేసేందుకు వైసీపీ ప్రభు త్వం ప్రయత్నించడం నిరుద్యోగులు గమనిస్తున్నారన్నారు. సార్వ త్రిక ఎన్నికల్లో వైసీపీకి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. బోయ రమణ, మల్లెంపల్లె జనార్దన్ యాదవ్, వడ్డె రాజశేఖర్, మహేంద్ర, రామాంజనేయులు, పులిశేఖర్ పాల్గొన్నారు.