Share News

వైసీపీని గద్దె దించాలి: అఖిలప్రియ

ABN , Publish Date - May 09 , 2024 | 12:47 AM

ప్రజల సొమ్మును దోపీడీ చేస్తున్న వైసీపీని గద్దె దించాలని టీడీపీ ఆళ్లగడ్డ అభ్యర్థి భూమా అఖిప్రియ అన్నారు.

వైసీపీని గద్దె దించాలి: అఖిలప్రియ

ఉయ్యాలవాడ, మే 8: ప్రజల సొమ్మును దోపీడీ చేస్తున్న వైసీపీని గద్దె దించాలని టీడీపీ ఆళ్లగడ్డ అభ్యర్థి భూమా అఖిప్రియ అన్నారు. సుద్దమల్ల, హరివరం గ్రామాల్లో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ నిత్యావస సరుకుల దగ్గర నుంచి వ్యవ సాయ ఎరువుల వరకు ప్రతి వస్తువుపై రేట్లు పెంచి పేద ప్రజలను దోపిడీ చేస్తు న్నారన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయ కులు వెంకటేశ్వరరెడ్డి, శేఖర్‌రెడ్డి, నారాయణరెడ్డి, బాబుల్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, మహేశ్వ రరెడ్డి, శ్రీనివాసరెడ్డి, కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

వైసీపీకి గుణపాఠం తప్పదు

రుద్రవరం: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వానికి గుణ పాఠం తప్పదని టీడీపీ అభ్యర్థి భూమా అఖిలప్రియ అన్నారు. పేరూరు గ్రామంలో బుధవారం రోడ్‌ షో నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ఆళ్లగడ్డలో అభి వృద్ధి ఎక్కడ జరిగిందని ప్రశ్నించారు. ఈ గ్రామానికి రహదారి గుంతలమయంగా ఉందన్నారు. నాగి రెడ్డిపల్లె నుంచి పేరూరు వెళ్లే రహదారి అధ్వానంగా తయారైందన్నారు. కార్యక్రమంలో రామనాథరెడ్డి, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 09 , 2024 | 12:47 AM