Share News

బాబు కలల ప్రాజెక్టులు పూర్తి చేస్తాం: నిమ్మల

ABN , Publish Date - Jun 16 , 2024 | 05:11 AM

ముఖ్యమంత్రి చంద్రబాబు కలల ప్రాజెక్టులు పూర్తి చేసి ఆయన లక్ష్యం నెరవేర్చేలా పనిచేస్తానని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.

బాబు కలల ప్రాజెక్టులు పూర్తి చేస్తాం: నిమ్మల

అమరావతి, జూన్‌ 15(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు కలల ప్రాజెక్టులు పూర్తి చేసి ఆయన లక్ష్యం నెరవేర్చేలా పనిచేస్తానని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. శనివారం సీఎం నివాసం వద్ద ఆయన మాట్లాడుతూ జలవనరుల శాఖను సమర్థవంతంగా నిర్వర్తించడం అంటే రాష్ట్ర ప్రజల రుణం తీర్చుకునే అవకాశం కలిగిందన్నారు. అలాంటి అవకాశాన్ని జగన్‌ కోల్పోవడంతో పాటు ప్రాజెక్టులను నిర్వీర్యం చేసి తీరని ద్రోహం చేశాడన్నారు. ఆవులపల్లి ప్రాజెక్టులో పెద్దిరెడ్డి రూ.600 కోట్ల మేర అవినీతికి పాల్పడ్డారని, ఎన్జీటీ నిబంధనలకు విరుద్దంగా ఆ ప్రాజెక్టు జరిగిందని తెలిపారు. జగన్‌ అనాలోచిత నిర్ణయాలతో కృష్ణానదీ జలాలపై అంతర్రాష్ట వివాదం తలెత్తిందన్నారు. జగన్‌ పోలవరం ప్రాజెక్టును విధ్వంసం చేశాడని తాము చెప్పడం కాదని, నీతి ఆయోగ్‌ కమిటీనే ధ్రువీకరించిందని గుర్తుచేశారు.

Updated Date - Jun 16 , 2024 | 05:12 AM