Share News

Nellore : దారులన్నీ దర్గావైపే!

ABN , Publish Date - Jul 19 , 2024 | 05:29 AM

రొట్టెల పండుగ సందర్భంగా నెల్లూరులోని బారాషాహీద్‌ దర్గా ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోతోంది.

Nellore : దారులన్నీ దర్గావైపే!

  • నెల్లూరుకు పోటెత్తుతున్న భక్తజనం.. ఉత్సాహంగా రొట్టెల పండుగ

నెల్లూరు, జూలై 18 (ఆంధ్రజ్యోతి): రొట్టెల పండుగ సందర్భంగా నెల్లూరులోని బారాషాహీద్‌ దర్గా ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోతోంది. పండుగ రెండో రోజు గురువారం భారీ ఎత్తున భక్తులు తరలివచ్చారు. మతాలకు అతీతంగా భక్తులు తరలిరావడంతో స్వర్ణాల చెరువు తీరం సందడిగా మారింది. బారాషాహీద్‌ దర్గా దర్శనం కోసం క్యూలైన్లు కిటకిటలాడాయి. కాగా, గురువారం అర్ధరాత్రి తర్వాత అత్యంత పవిత్రమైన గంధమహోత్సవం జరిగింది.

Updated Date - Jul 19 , 2024 | 05:29 AM