రేపు చీరాలలో 2కే రన్
ABN , Publish Date - May 08 , 2024 | 11:51 PM
టీడీపీ కూటమి ఆధ్వర్యంలో శుక్రవారం చీరాల పోలేరమ్మ గుడి వద్ద నుంచి స్థానిక గడియార స్తంభం సెంటర్ వరకు ఉదయం 10 గంటలకు 2కె రన్ కార్యక్రమం తెలుగు ప్రొఫెషనల్ వింగ్ (టీపీడబ్ల్యు) నిర్వహిస్తున్నారని, అందులో తాను పాల్గొంటున్నట్లు సినీ హీరో నిఖిల్ సిద్ధార్థ బుధవారం తెలిపారు.
చీరాల, మే 8 : టీడీపీ కూటమి ఆధ్వర్యంలో శుక్రవారం చీరాల పోలేరమ్మ గుడి వద్ద నుంచి స్థానిక గడియార స్తంభం సెంటర్ వరకు ఉదయం 10 గంటలకు 2కె రన్ కార్యక్రమం తెలుగు ప్రొఫెషనల్ వింగ్ (టీపీడబ్ల్యు) నిర్వహిస్తున్నారని, అందులో తాను పాల్గొంటున్నట్లు సినీ హీరో నిఖిల్ సిద్ధార్థ బుధవారం తెలిపారు. ఈ నెల 13వ తేదీ జరిగే పోలింగ్లో టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎం కొండయ్యకు, ఎంపీ అభ్యర్థి తెన్నేటి కృష్ణప్రసాద్కు సైకిల్ గు ర్తుపై ఓట్లు వేయాలని, అందుకు అందరిని జాగృతం చేసేందుకు 2కే రన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తనతో పాటు యువ త పెద్ద సంఖ్యలో పా ల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన కోరారు.