Share News

వైసీపీకి వీరవిధేయులుగా ప్రభుత్వ ఉద్యోగులు

ABN , Publish Date - May 08 , 2024 | 11:49 PM

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు వైసీపీకి వీరవిధేయులుగా ఉన్నారు. తాము ప్రభుత్వ ఉద్యోగులం అన్న సంగతి మరిచి బరితెగించి వైసీపీకి ప్రచారం చేస్తున్నారు.

వైసీపీకి వీరవిధేయులుగా ప్రభుత్వ ఉద్యోగులు
తాటిపర్తి ప్రచారంలో మర్రివేముల వెలుగు వీవోఏ బ్రహ్మం

పుల్లలచెరువు, మే 8 : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు వైసీపీకి వీరవిధేయులుగా ఉన్నారు. తాము ప్రభుత్వ ఉద్యోగులం అన్న సంగతి మరిచి బరితెగించి వైసీపీకి ప్రచారం చేస్తున్నారు. బుధవారం పుల్లలచెరువు మండలం మర్రివేములలో వైసీపీ అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇదే గ్రామానికి చెందిన ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు ఆయన ప్రచార సేవలో మునిగిపోయారు. మర్రివేముల ఉపాధి ఫీల్డ్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఎస్‌ చెన్నయ్య, పెద్దారవీడు విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో షిఫ్ట్‌ ఆపరేటరు వీ వెంకటేశ్వర్లు, వెలుగు వీవోఏ ఇల్లా బ్రహ్మంలు యథేచ్ఛగా వైసీపీ ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించి వైసీపీ ప్రచారంలో పాల్గొన్న ముగ్గురు ఉద్యోగులపై ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచిచూడాల్సిందే.

Updated Date - May 08 , 2024 | 11:49 PM