Share News

3వ తేదీలోపు వేతన బకాయిలు చెల్లించాలి

ABN , Publish Date - Jul 26 , 2024 | 12:27 AM

ఆర్టీసీలో కాం ట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ కా ర్మికులకు వేతన బకాయిల ను ఆగస్టు 3లోపు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవా లని కార్మికశాఖ కమిషనర్‌ కె.కనకదుర్గాభవాని ఆదేశిం చారు.

3వ తేదీలోపు వేతన బకాయిలు చెల్లించాలి

ఒంగోలు(కలెక్టరేట్‌), జూలై 25 : ఆర్టీసీలో కాం ట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ కా ర్మికులకు వేతన బకాయిల ను ఆగస్టు 3లోపు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవా లని కార్మికశాఖ కమిషనర్‌ కె.కనకదుర్గాభవాని ఆదేశిం చారు. ఒంగోలులోని కార్మిక శాఖ కార్యాలయంలో ఆర్టీసీ డిపోమేనేజర్‌ శ్రీనివాసరావు, అసిస్టెంట్‌ మేనేజర్‌ ఎల్‌.కోటేశ్వరరావు, కార్మికుల పక్షాన సీఐటీయూ జిల్లా కార్యదర్శి జి.శ్రీనివాసరావు, స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ రీజియన్‌ అధ్యక్షుడు బీవీ.రావులతో గురువారం చర్చలు జ రిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న కనకదుర్గాభవాని మాట్లాడుతూ ఆర్టీసిలోని గ్యారేజీలలో పనిచేస్తున్న కార్మికులకు ఏడాది కాలంగా వేతనాలు ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నించారు. వెంటనే పెండింగ్‌ బకాయిలను చెల్లించడంతో పాటు ఆ రునెలలకు ఒకసారి డీఏ లెక్కకట్టి వేతనాలు ఇవ్వాలని ఆదేశించారు.

Updated Date - Jul 26 , 2024 | 12:27 AM