Share News

తాగు నీటి సమస్యను పరిష్కరించండి

ABN , Publish Date - Jul 25 , 2024 | 11:52 PM

నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలతో పాటు ప్రధానంగా తాగు నీటి సమస్యను పరిష్కరించాలని సీఎం చంద్రబాబును టీడీపీ వైపాలెం నియోజకవర్గ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు కోరారు.గురువారం అమరావతిలోని సచివాలయంలో సీఏం కలిసి నియోజకవర్గంలో సమస్యలు,చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులను ఆయన దృష్టికి తీసుకెళ్ళారు. ప్రధానంగా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో తాగు నీటి సమస్య తీవ్రంగా ఉన్నదని, దాన్ని పరిష్కరించేందుకు నిధులు కేటాయించాలని విన్నవించారు.

తాగు నీటి సమస్యను పరిష్కరించండి
సీఎం చంద్రబాబును కలిసి వినతిపత్రాన్ని అందించి సమస్యను వివరిస్తున్న ఎరిక్షన్‌బాబు

పుల్లలచెరువు, జూలై 26: నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలతో పాటు ప్రధానంగా తాగు నీటి సమస్యను పరిష్కరించాలని సీఎం చంద్రబాబును టీడీపీ వైపాలెం నియోజకవర్గ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు కోరారు.గురువారం అమరావతిలోని సచివాలయంలో సీఏం కలిసి నియోజకవర్గంలో సమస్యలు,చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులను ఆయన దృష్టికి తీసుకెళ్ళారు. ప్రధానంగా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో తాగు నీటి సమస్య తీవ్రంగా ఉన్నదని, దాన్ని పరిష్కరించేందుకు నిధులు కేటాయించాలని విన్నవించారు. నియోజకవర్గంలోని రోడ్‌లు అధ్వానంగా ఉన్నాయని, ప్రధానంగా ఎర్రగొండపాలెం-త్రిపురాంతకం,ఎర్రగొండపాలెం -పుల్లలచెరువు, గ్రామాల్లోని లింకు రోడ్డులు పాడైపోయాయని అన్నారు. సంక్షేమ హాస్టళ్లు అధ్వానంగా ఉన్నాయని విద్యార్థులు సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు.పుల్లలచెరువు మండలానికి వర ప్రదాయని అయిన వెలిగొండ తీగలేరును చిన్న కండ్లేరుకు అనుసంధానం చేయాలని సీఎంను కోరినట్లు ఆయన తెలిపారు.అన్ని విషయాలకు సీఎం సానుకూలంగా ఉన్నారని ఆయన తెలిపారు.

Updated Date - Jul 25 , 2024 | 11:52 PM