Share News

ఎరిక్షన్‌బాబు గెలుపుతోనే మీ బిడ్డల భవితకు వెలుగు

ABN , Publish Date - May 09 , 2024 | 12:48 AM

: రాష్ట్రం అభివృద్ధి చెంది, పేదప్రజలకు సంక్షేమ పథకాలు అందా లంటే చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందని టీడీపీ సీనియర్‌ నాయకుడు జడ్పీ మాజీ ఉపాధ్యక్షుడు డాక్టరు మన్నె రవీంద్ర అన్నారు.

ఎరిక్షన్‌బాబు గెలుపుతోనే మీ బిడ్డల భవితకు వెలుగు

ఎర్రగొండపాలెం, మే 8 : రాష్ట్రం అభివృద్ధి చెంది, పేదప్రజలకు సంక్షేమ పథకాలు అందా లంటే చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందని టీడీపీ సీనియర్‌ నాయకుడు జడ్పీ మాజీ ఉపాధ్యక్షుడు డాక్టరు మన్నె రవీంద్ర అన్నారు. ఎర్రగొండపాలెం మండలం తమ్మడపల్లి గ్రామంలో బుధవారం సాయంత్రం జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వెలిగొండపాలెం ప్రాజెక్టు పూర్తై మన పశ్చిమ ప్రకాశం ప్రజలకు సాగునీరు, తాగునీరు అందాలంటే టీడీపీకి ఓట్లు వేసి ఎమ్మెల్యేగా గూడూరి ఎరిక్షన్‌బాబును, ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డిని గెలిపించాలని అన్నారు. గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్మోహాన్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు ఎన్నో ఆశలు పెట్టి అధికారంలోకి వచ్చాడన్నారు. అనంతరం పోలవరం, వెలిగొండ ప్రాజెక్టు పనులను పూర్తి చేయకుండా నిర్లక్ష్యంగా వదిలేశారన్నారు. మరోసారి ప్రజలను మోసం చేయడానికి జగన్‌ సిద్ధమై మాయమాటలు చెబుతున్నాడన్నారు. వైసీపీని సాగనంపేందుకు ప్రతిఓటరు సిద్ధపడాలన్నారు. . టీడీపీ అధికారంలోకి రావాలంటే మహిళలు అందరూ చైతన్యవంతులై టీడీపీకి ఓట్లు వేసి గెలిపించాల్సిన అవసరం ఉందని అభ్యర్థించారు. కార్యక్రమంలో టీడీపీ కూటమి అభ్యర్థి ఎరిక్షన్‌ బాబు కుమార్తె చెల్సియా టీడీపీని గెలిపించి నియోజకవర్గంలోని గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే పేదల జీవితాల్లో వెలుగులు నిండుతాయన్నారు. ప్రతి ఒక్కరు మే 13వ తేదీ జరిగే ఎన్నికల రోజున సైకిల్‌గుర్తు పై ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

వైసీపీని వీడి టీడీపీలోకి వలసలు

త్రిపురాంతకం : మండలంలోని ముడివేముల పంచాయితీలోని పాపన్నపాలెం గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు బుధవారం వైసీపీని వీడిటీడీపీలోకి చేరారు. మాజీ సర్పంచ్‌, సీనియర్‌ నాయకుడు దేవినేని చలమయ్య ఆద్వర్యంలో వైసీపీని వీడిన 25 కుటుంబాలు టీడీపీలో చేరాయి. కొత్తగా పార్టీలో చేరిన వారికి మాజీ జడ్పీ ఉపాధ్యక్షులు డాక్టర్‌ మన్నే రవీంద్ర టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈసందర్బంగా రవీంద్ర మాట్లాడుతూ చంద్రబాబుపై నమ్మకంతో అందరూ టీడీపీకి ఆకర్షితులవుతున్నారని అన్నారు. లేళ్ళపల్లికి చెందిన జిల్లెల్ల గణేష్‌రెడ్డి, దుద్దేల నాగిరెడ్డి వై.పాలెంలోని పార్టీ కార్యాలయంలో టీడీపీలో చేరారు. వీరికి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరి ఎరిక్షన్‌బాబు టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈకార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - May 09 , 2024 | 12:48 AM