యువకుడి హత్యకేసులో ముగ్గురికి జీవిత ఖైదు
ABN , Publish Date - Jul 26 , 2024 | 12:23 AM
వివాహేతర సం బంధం కారణంగా యువకుడిని హత్య చేసిన ముగ్గురికి యావజ్జీవ కారగార శిక్ష విధిస్తూ ఒం గోలులోని ఎస్సీ, ఎస్టీ కోర్టు న్యాయాధికారి రాజా వెంకటాద్రి గురువారం తీర్పు నిచ్చారు.
ముద్దాయిలుగా హతుడి భార్య, అత్త, మరో యువకుడు
ఎస్సీ, ఎస్టీ కోర్టు న్యాయాధికారి తీర్పు
ఒంగోలు(క్రైం), జూలై 25: వివాహేతర సం బంధం కారణంగా యువకుడిని హత్య చేసిన ముగ్గురికి యావజ్జీవ కారగార శిక్ష విధిస్తూ ఒం గోలులోని ఎస్సీ, ఎస్టీ కోర్టు న్యాయాధికారి రాజా వెంకటాద్రి గురువారం తీర్పు నిచ్చారు. నిందితు లు త్రిపురాతకం మండంల అన్నసముద్రం గ్రామానికి చెందిన శెట్టి బాలచెన్నయ్య, కురిచేడు మండలం దేకనకొండకు చెందిన చామల వెంకట సుబ్బులు, త్రిపురాంతకం మండలం గుట్టల ఉమ్మడివరంనకు చెందిన మెడబలిమి నాగలక్ష్మిల పై నేరం రుజువు కావడంతో జీవిత ఖైదు తోపా టుగా వెయ్యిరూపాయలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. ప్రాషిక్యూషన్ కఽథనం మేరకు 2015 సంవత్సరలో త్రిపురాంతకం మండలం గుంటల ఉమ్మడివరంనకు చెందిన మె డబలిమి చినఆంజనేయులుకు, అన్నసముద్రం నకు చెందిన శెట్టి బాలచెన్నయ్య మద్యం తాగించి మందలబైలు వద్దకు తీసుకెళ్ళి హత్య చేశాడు. చిన ఆంజనేయులును హత్య చేసేందుకు అతని భార్య నాగలక్ష్మి, అత్త వెంకటసుబ్బులు, బాలచెన్నయ్యతో కలిసి పథకం రూపొందించారు. బాలచెన్నయ్యతో నాగలక్ష్మి, వెంకటసుబ్బులుకు ఉన్న వివాహేతర సంబంధానికి అడ్డులేకుండా చేసుకునేందుకు భర్తను హత్య చేసేందుకు కుట్ర పన్నారు. ఈక్ర మంలో నాగలక్ష్మి తన తల్లి, ప్రియుడుతో కలిసి ప్రణాళిక ప్రకారం భర్తను దారుణంగా హత్య చే యించిది. ఈ మేరకు హత్యా నేరం రుజువు కావడంతో న్యాయాధికారి ముగ్గురికి జీవిత ఖైదీ విధించారు. ప్రాషిక్యూషన్ తరుపున అదనపు పీపీ సి.శ్రీనివాస మూర్తి, న్యాయాధికారి జేహెచ్.జోష్పిన్ తమ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా హత్య కేసులో నిందితులకు శిక్షలు పడే విధంగా సాక్షాధా రాలు సేకరిచిన పోలీసు అధికారులు అప్పటి దర్శి డీఎస్పీ రాంబాబు, ప్రస్తుతం దర్శి డీఎస్పీ అశో క్వర్ధన్, అప్పటి దర్శి సీఐ రాఘవేంద్రరావులను ఎ స్పీ దామోదర్ అభినందించారు.