Share News

Gummanuru Jayaram: మంత్రి గుమ్మనూరుకు షాక్

ABN , Publish Date - Jan 11 , 2024 | 07:41 AM

వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జుల మార్పు ఎప్పుడైతే చేపట్టిందో అప్పటి నుంచి వైసీపీ నేతలకు షాక్‌ల మీద షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ఏపీ సీఎం జగన్ మూడో జాబితాను సిద్ధం చేయడంపైనే పూర్తి దృష్టి సారించారు. ఈ మూడో జాబితాలో ఎవరెవరని సాగనంపుతారోనని నేతలంతా భయాందోళనకు గురవుతున్నారు

Gummanuru Jayaram: మంత్రి గుమ్మనూరుకు షాక్

కర్నూలు: వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జుల మార్పు ఎప్పుడైతే చేపట్టిందో అప్పటి నుంచి వైసీపీ నేతలకు షాక్‌ల మీద షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ఏపీ సీఎం జగన్ మూడో జాబితాను సిద్ధం చేయడంపైనే పూర్తి దృష్టి సారించారు. ఈ మూడో జాబితాలో ఎవరెవరని సాగనంపుతారోనని నేతలంతా భయాందోళనకు గురవుతున్నారు. మంత్రి గుమ్మనూరు జయరాంకు ఝలక్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.

గుమ్మనూరుకు ఆలూరు టికెట్‌ను జగన్ నిరాకరించారట. సీఎం జగన్‌ను మంత్రి గుమ్మనూరు కలిసిన తర్వాత సమీకరణాలన్నీ మారిపోయినట్టుగా తెలుస్తోంది. వైసీపీ అభ్యర్థిగా చిప్పగిరి జడ్పీటీసీ సభ్యుడు విరుపాక్షికి టికెట్ ఇవ్వనున్నారని సమాచారం. అయితే మంత్రి గుమ్మనూరుకు కర్నూలు ఎంపీ టికెట్ ప్రకటించే అవకాశం ఉంది. నేడు దీనిని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. బీసీ మహిళ కప్పట్రాళ్ల బొజ్జమ్మకు కూడా జగన్ హ్యాండ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.

Updated Date - Jan 11 , 2024 | 07:49 AM