Share News

కేజీబీవీలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

ABN , Publish Date - Jul 26 , 2024 | 11:35 PM

కోటబొమ్మాళి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఇంటర్‌ మొదటి సంవత్సరం బైపీసీ చదువుతున్న బొడ్డాపు పూజ గురువారం రాత్రి భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

కేజీబీవీలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

టెక్కలి: కోటబొమ్మాళి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఇంటర్‌ మొదటి సంవత్సరం బైపీసీ చదువుతున్న బొడ్డాపు పూజ గురువారం రాత్రి భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సిబ్బంది తెలిపిన వివరాల మేరకు.. కేజీబీవీలో చేరి ఇంటికి వెళ్లిన ఆమె గురువారమే తిరిగి వచ్చింది. రాత్రి భోజనాల తరువాత మేడ మొదటి అంతస్తుపైకి వెళ్లి అక్కడి నుంచి కిందకు దూకింది. గమనించిన తోటి విద్యార్థినులు సిబ్బందికి సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఆమెను కోటబొమ్మాళి ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఆమె కుడికాలు విరిగిపోయింది. సమాచారాన్ని టెక్కలి మండలం పరశురాంపురం గ్రామంలో ఉన్న ఆమె తల్లిదండ్రులు బొడ్డాపు గవరయ్య, లక్ష్మిలకు వారు ఇచ్చారు. దీంతో రాత్రే తల్లిదండ్రులు ఆసుపత్రికి చేరుకున్నారు. పూజకు మెరుగైన వైద్య సేవలకు గాను శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు తెలు స్తుంది. అయితే ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలని భావించిందో తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా ప్రిన్సిపాల్‌ కె.ప్రసన్నలక్ష్మి మాత్రం పూజ కాలుజారి పడిందని చెప్పడం కొసమెరుపు. ఈ ఘటనపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని కోటబొమ్మాళి ఎస్‌ఐ మహ్మద్‌ ఆలీ శుక్రవారం తెలిపారు.

Updated Date - Jul 26 , 2024 | 11:35 PM